కొవ్వొత్తుల పరిశ్రమలో పేలుడు: 8 మంది మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జిల్లా మోదీనగర్‌లో పేలుడు సంభవించింది. కొవ్వొత్తుల పరిశ్రమలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఏడుగురు మృత్యువాతపడగా..

Published : 06 Jul 2020 01:37 IST

ఘజియాబాద్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జిల్లా మోదీనగర్‌లో పేలుడు సంభవించింది. కొవ్వొత్తుల పరిశ్రమలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాతపడగా.. నలుగురికి గాయాలయ్యాయి. కర్మాగారంలో మండే స్వభావం ఉన్న రసాయనాలు ఉంచగా.. వాటికి మంటలు అంటుకోవడంతో ఈ పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. 

ఈ క్రమంలో అగ్నికీలలు కర్మాగారం మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని 12 అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని