అలిగిన ‘నేస్తం’...కాలిన ‘మగ్గం’
నేతన్నకు మగ్గమే సర్వస్వం. తనను కన్నవారికి, తాను కన్నవారికి, తన ప్రపంచానికి రంగులద్దే సహధర్మచారిణికిచ్చే స్థానాన్ని దానికీ ఇస్తాడు. పడుగు, పేకలతోనే జీవితాన్ని అల్లుకుంటాడు. అలాంటి కార్మికుడు ‘నేతన్న నేస్తం’ జాబితాలో పేరు లేదనే...
హిందూపురం, న్యూస్టుడే: నేతన్నకు మగ్గమే సర్వస్వం. తనను కన్నవారికి, తాను కన్నవారికి, తన ప్రపంచానికి రంగులద్దే సహధర్మచారిణికిచ్చే స్థానాన్ని దానికీ ఇస్తాడు. పడుగు, పేకలతోనే జీవితాన్ని అల్లుకుంటాడు. అలాంటి కార్మికుడు ‘నేతన్న నేస్తం’ జాబితాలో పేరు లేదనే... విరక్తితో మగ్గానికే నిప్పంటించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అనంతపురం జిల్లా హిందూపురం మండలం బాలంపల్లికి చెందిన కె.కాళాచారి 11 ఏళ్లుగా మగ్గం నేస్తున్నారు. గుర్తింపు కార్డూ ఉంది. కరోనా కారణంగా కొంతకాలం ముడి సరకు దొరక్క మగ్గం కట్టేశారు. నేతన్న నేస్తం కోసం గ్రామంలో తయారు చేసిన జాబితాలో తన పేరున్నా... పైనుంచి మంజూరు రాలేదని, న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగారు. ఫలితం దక్కకపోవడంతో బుధవారం మగ్గాన్ని కాల్చేస్తూ సెల్ఫీ వీడియో తీశారు. అది గురువారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్