యజమాని ఇంటికే కన్నం
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నెలరోజులుగా తల్లిదండ్రులకు దూరంగా కాపురం పెట్టాడు. చివరికి జీవనోపాధి ఇబ్బందికరంగా మారడంతో దొంగగా మారి, యజమాని ఇంటికే కన్నం వేశాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో రూ.4 లక్షల విలువ చేసే 13.45 తులాల బంగారు ఆభరణాలు
నిందితుడి అరెస్టు
రూ.4 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం
సైదాబాద్, న్యూస్టుడే: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నెలరోజులుగా తల్లిదండ్రులకు దూరంగా కాపురం పెట్టాడు. చివరికి జీవనోపాధి ఇబ్బందికరంగా మారడంతో దొంగగా మారి, యజమాని ఇంటికే కన్నం వేశాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో రూ.4 లక్షల విలువ చేసే 13.45 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సైదాబాద్ సీఐ కస్తూరి శ్రీనివాస్ వివరాల ప్రకారం.. సైదాబాద్ డివిజన్ సాయిరాం కాలనీలో బజ్జూరి నితీష్గౌడ్(21) కుటుంబ సభ్యులతో కలిసి ఉండేవాడు. ప్రేమ వివాహం చేసుకున్న ఇతను చంపాపేటలో గాంధీ విగ్రహం పరిసరాల్లో వేరే కాపురం పెట్టాడు. జీవనోపాధి కోసం ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తోడవ్వడంతో ఈనెల 7న తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చాడు. వారు అద్దెకు ఉండే ఇంటి యజమాని రవి చౌహాన్ కుటుంబ సభ్యులతో తిరుపతికి వెళ్లాడని తెలుసుకున్నాడు. అదేరోజు రాత్రి యాక్సాబ్లేడ్తో తాళం కోసి దొంగతనానికి పూనుకున్నాడు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఇంటి నిండా కారంపొడి చల్లాడు. ఈనెల 8న సమాచారం అందుకున్న రవి చౌహాన్ సోదరుడు వినోద్ చౌహాన్ సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న డీఎస్సై పి.మాధవరావు దర్యాప్తు చేపట్టారు. నితిష్గౌడ్పై సందేహంతో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం అంగీకరించడంతో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసును పరిష్కరించిన తీరును హైదరాబాద్ నగర జాయింట్ కమిషనర్, తూర్పు పోలీస్ మండలం ఇన్ఛార్జి ఎం.రమేష్ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, కొత్త కస్టమర్లు చేర్చుకోవడంపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ