ఆ చిన్నారి తండ్రి ఆత్మహత్య

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో హత్యకు గురైన చిన్నారి ఆద్య తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భువనగిరి రైల్వేస్టేషన్‌ వద్ద రైలు కిందపడి ఆద్య త్రండ్రి కల్యాణ్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మకూరు(ఎం)లో

Published : 13 Jul 2020 01:01 IST


ఘట్‌కేసర్‌ : మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో హత్యకు గురైన చిన్నారి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భువనగిరి రైల్వేస్టేషన్‌ వద్ద రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మకూరు(ఎం)లో పంచాయతీ కార్యదర్శిగా ఈయన పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన‌ కుమార్తెను కరుణాకరణ్‌ అనే వ్యక్తి గొంతుకోసి చంపాడు. కుమార్తె మృతితో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెబుతున్నారు.

అసలేం జరిగిందంటే..
తల్లి ఫేస్‌బుక్‌ స్నేహితుడే ఆ చిన్నారి పట్ల కాలయముడై ప్రాణం తీశాడు. మేడ్చల్‌ జిల్లా పోచారంలో గత గురువారం ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సికింద్రాబాద్‌లోని భవానీనగర్‌కు చెందిన కరుణాకర్‌తో ఓ వివాహితకు మూడు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. గత కొద్ది రోజులుగా రాజశేఖర్‌‌ అనే మరో యువకుడితో ఆమె దగ్గరగా ఉండటం గమనించిన కరుణాకర్‌ ఆగ్రహానికి లోనయ్యాడు.ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం 12.30గంటల సమయంలో ఆమె ఇంటికి వచ్చాడు. అప్పటికే ఆమె ఇంట్లో రాజశేఖర్‌‌ ఉండటంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కరుణాకర్ రాకను గమనించిన ఆమె.. రాజశేఖర్‌‌ను బాత్‌రూంలో దాచింది. గదిలో నుంచి బయటకు రావాలని అతడు ఒత్తిడిచేశాడు. బయటకు రాకపోతే చిన్నారిని చంపుతానని బెదిరించాడు. అయినా అతడు బయటకు రాకపోవడంతో ఆ చిన్నారి గొంతు కోసి చంపాడు. అనంతరం రాజశేఖర్‌‌‌ బయటకు వచ్చాడు. దీంతో అతడిపై కత్తితో దాడిచేయగా..  పరుగులు తీశాడు. దాడి అనంతరం తానూ కత్తితో గొంతుకోసుకున్నాడు.

ఇదీ చదవండి..

పాపను బలిగొన్న ఫేస్‌బుక్‌ పరిచయం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని