ఉద్యోగం దొరకట్లేదని.. ఉసురు తీసుకున్నాడు
కష్టపడి చదివి ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ప్రైవేటు ఉద్యోగం సంపాదించాడు. తరువాత దాన్ని వదిలేసి ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూశాడు. తాను ఖాళీగా ఇంటి వద్ద ఉంటుండటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఇది మానసిక కుంగుబాటుకు దారి తీసింది. కలుపు మందు తాగి బలవన్మరణానికి ఒడిగట్టాడు.
కలుపు మందు తాగిన యువకుడు ●
చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి
కష్టపడి చదివి ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ప్రైవేటు ఉద్యోగం సంపాదించాడు. తరువాత దాన్ని వదిలేసి ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూశాడు. తాను ఖాళీగా ఇంటి వద్ద ఉంటుండటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఇది మానసిక కుంగుబాటుకు దారి తీసింది. కలుపు మందు తాగి బలవన్మరణానికి ఒడిగట్టాడు.
బొద్దాం(రాజాం), న్యూస్టుడే: రాజాం మండలం బొద్దాం గ్రామానికి చెందిన బొమ్మన మధు (30) ఇంజినీరింగ్ వరకు చదివాడు. చేస్తున్న ఉద్యోగం వదిలేశాక..ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరక్క పోవటంతో ఈనెల మూడో తేదీన కలుపు నివారణ మందు తాగాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో ఎకాఎకిన జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. అంతే కళ్లెదుటే కొడుకు విగతజీవిగా కనబడటంతో తల్లిదండ్రులు మహేశ్వరి, కరుణాకర్రావు, సోదరి స్వాతి గుండెలవిసేలా రోదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. రన్వేపై వీడియో చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
-
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్
-
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..