రాంగ్ కాల్ వచ్చింది.. నిండా ముంచింది
అతనెవరో వీరికి తెలియదు.. వీరెవరో అతనికి తెలియదు.. ఎనిమిది నెలల కిందట వచ్చిన ఓ రాంగ్ కాల్ ఇద్దరినీ కలిపింది. ఆ క్రమంలో సాగిన పరిచయాలు ఇద్దరు మహిళలను కుటుంబానికి దూరం ..
బెలగాం: అతనెవరో వీరికి తెలియదు.. వీరెవరో అతనికి తెలియదు.. ఎనిమిది నెలల కిందట వచ్చిన ఓ రాంగ్ కాల్ ఇద్దరినీ కలిపింది. ఆ క్రమంలో సాగిన పరిచయాలు ఇద్దరు మహిళలను కుటుంబానికి దూరం చేశాయి. ఇంటినుంచి వెళ్లిపోయేలా చేశాయి. ఇటీవల ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఇద్దరు మహిళలు, ఓ బాలుడి మిస్టరీని పోలీసులు ఛేదించారు. చివరకు వీరు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వివరాలను గురువారం ఎస్ఐలు కళాధర్, జయంతి విలేకర్లకు వివరించారు.
విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణ పరిధికి చెందిన ఓ వివాహిత తన నాలుగేళ్ల కుమారుడు, చెల్లి(ఈమె మైనరు)ని తీసుకుని ఈనెల 10న ఇంటినుంచి బయటకి వెళ్లి తిరిగి రాలేదు. దీనిపై తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణ ఎస్ఐ జయంతి, గ్రామీణ ఎస్ఐ వీరబాబు దర్యాప్తు చేపట్టారు. సదరు వివాహితకు ధర్మవరం పట్టణానికి చెందిన అపరిచిత జి.హర్షవర్దన్ నుంచి రాంగ్ కాల్ వచ్చింది. అప్పటినుంచి తరచూ చరవాణిలో మాట్లాడుకుంటూ పరిచయాలను పెంచుకున్నారు. ఈ క్రమంలో అతని సూచన మేరకు ఈనెల 10న తన చెల్లిని, కుమారుడిని తీసుకుని వివాహిత అనంతపురం బయలుదేరి వెళ్లింది. అక్కడి నుంచి బెంగళూరులో ఓ ఇంటిని తీసుకుని ఉంచాడు. వీరి వివరాలను ఫోన్ కాల్స్ ద్వారా ఎక్కడ ఉన్నదీ పోలీసులు గుర్తించారు. బెంగళూరులో ఉన్న హర్షవర్దన్తో పాటు ఇరువురు మహిళలను, బాలుడిని తీసుకుని పార్వతీపురం తీసుకువచ్చారు. తల్లికి అప్పగించారు. హర్షవర్దన్పై కేసు నమోదు చేశారు. ఇందులో ప్రమేయం ఉన్న వంశీ అనే యువకుడిని, అతని తల్లిపైన కూడా కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ కళాధర్ తెలిపారు. ముఖ్యంగా మహిళలు అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని వివాదాల్లోకి వెళ్లవద్దని ఆయన సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు