చిక్కుల్లో ఐంద్రిత దంపతులు

చందనసీమ నటీనటులు- దంపతులు ఐంద్రిత రై- దిగంత్‌లకు బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ దళం (సీసీబీ) అధికారులు తాఖీదులు జారీ చేశారు

Updated : 16 Sep 2020 08:02 IST

బెంగళూరు (సదాశివనగర): చందనసీమ నటీనటులు- దంపతులు ఐంద్రిత రై- దిగంత్‌లకు బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ దళం (సీసీబీ) అధికారులు తాఖీదులు జారీ చేశారు. కొలంబోలోని క్యాసినోలకు రావాలంటూ అంతర్జాలంలో ఇచ్చిన ప్రకటనల్లో ఆమె కనిపించారు. రాజరాజేశ్వరినగరలోని వారి నివాసానికి వెళ్లి నోటీసులు అందించారు. తన కుమారుడు, కోడలు ఇద్దరూ పర్యటన నిమిత్తం కేరళకు వెళ్లారని దిగంత్‌ తల్లి పోలీసులకు తెలిపారు. తమను సంప్రదించిన మాధ్యమ ప్రతినిధులతో ఐంద్రిత మాట్లాడుతూ ‘తాము ఎక్కడికీ పరారీ కాలేదు. బుధవారం సీసీబీ అధికారుల ముందు విచారణకు హాజరవుతాం’ అని స్పష్టం చేశారు. క్యాసినోలకు రావాలంటూ ప్రకటనల్లో కనిపించిన నటీనటులందరికీ నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేసుకుంటున్నారు.

‘రాగిణి నిరపరాధి’

డ్రగ్స్‌ కేసులో కారాగారంలో రిమాండులో ఉన్న నటి రాగిణికి ఇంటి నుంచి తయారు చేసి తీసుకు వచ్చిన ఆహారాన్ని అందించేందుకు ఆమె తల్లి రోహిణి ద్వివేది మంగళవారం ప్రయత్నించారు. కారాగారం ప్రధాన ద్వారం వద్ద భద్రత సిబ్బంది అందుకు అంగీకరించలేదు. ఈ సమయంలో తనను కలుసుకున్న విలేకరులతో ఆమె మాట్లాడుతూ ‘రాగిణి నిరపరాధి. ఆమె పులిలా పోరాటం చేస్తుంది. అపనిందలు, ఆరోపణల నుంచి బయట పడుతుంది. ఆమె వెన్నంటి ఉన్న వారే, ఉద్దేశ పూర్వకంగా ఈ కేసులో ఇరికించారు. న్యాయస్థానం ఆమెకు జామీను మంజూరు చేస్తుందన్న నమ్మకం ఉంది. నిజానిజాలేమిటో త్వరలో అందరికీ తెలుస్తాయి’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని