పుట్టింటిపై ప్రేమ.. మెట్టింట్లో దొంగను చేసింది
తాహతుకు మించిన సంబంధాలు.. పెళ్లి కోసం ఆడంబరాలు.. దొరికినచోటల్లా అప్పులు! అవి తీర్చలేక సతమతం.. ఇలాంటి సాలెగూడులో చిక్కుకున్న ఓ మధ్యతరగతి యువతి దయనీయ పరిస్థితుల్లో దొంగగా మారింది. పుట్టింటిపై ప్రేమ ఆమెను మెట్టింట్లో దొంగను చేసింది.
పెళ్లి అప్పు తీర్చేందుకు అత్తారింట్లో చోరీ
నిందితురాలు, సహకరించిన తల్లి అరెస్టు
ఈనాడు, హైదరాబాద్, జవహర్నగర్, న్యూస్టుడే: తాహతుకు మించిన సంబంధాలు.. పెళ్లి కోసం ఆడంబరాలు.. దొరికినచోటల్లా అప్పులు! అవి తీర్చలేక సతమతం.. ఇలాంటి సాలెగూడులో చిక్కుకున్న ఓ మధ్యతరగతి యువతి దయనీయ పరిస్థితుల్లో దొంగగా మారింది. పుట్టింటిపై ప్రేమ ఆమెను మెట్టింట్లో దొంగను చేసింది. తన పెళ్లి కోసం అప్పుల్ని చేసి తీర్చలేక తల్లడిల్లుతున్న తల్లిని ఆదుకోవడం కోసం అత్తవారింట్లో చోరీకి పాల్పడి చివరకు కటకటాలపాలైంది. ఆమెకు సహకరించిన తల్లిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఈ కేసు వివరాలను శుక్రవారం వెల్లడించారు. ఈనెల 23 రాత్రి యాప్రాల్కు చెందిన వెంకటస్వామి తన ఇంట్లో చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పరిసరాల్లోని సీసీ ఫుటేజీని పరిశీలించగా బురఖా ధరించిన ఓ యువతి ఇంట్లోకెళ్లినట్లు గుర్తించారు. లోతుగా ఆరా తీయగా ఫిర్యాదుదారుడి కోడలే చోరీకి పాల్పడిందని గుర్తించారు. శుక్రవారం నిందితురాలిని, ఆమె తల్లిని అదుపులోకి తీసుకుని సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వెంకటస్వామి కుమారుడికి నిందితురాలితో 2016లో వివాహమైంది. ఆ పెళ్లి కోసం ఆమె తల్లి రూ.30 లక్షలు అప్పు చేసింది. ఆర్థిక సమస్యల వల్ల బాకీ తీర్చలేకపోయింది. దీంతో అత్తవారింట్లో చోరీ చేసేలా కుమార్తెను ఒప్పించింది. నాలుగురోజుల ముందే ఆమె పుట్టింటికి వచ్చింది. ఈనెల 23న అత్తవారింట్లో అందరూ బంధువుల పెళ్లికి వెళ్లారని తెలుసుకుని తల్లీ, కూతురు రంగంలోకి దిగారు. తన దగ్గరున్న తాళంచెవితో తలుపుతీసి కుమార్తె అత్తవారింట్లోకి వెళ్లింది. దొంగలు పడినట్లు భావించేలా ఇల్లంతా చిందరవందర చేసింది. అల్మారాను పగలగొట్టింది. 44 తులాల బంగారం, 15 తులాల వెండి, రూ. 10,500 నగదు తీసుకుని వెనుక తలుపు నుంచి ఉడాయించింది. చివరకు ఇద్దరూ పోలీసులకు చిక్కారు. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఇన్స్పెక్టర్లు పి.భిక్షపతిరావు (జవహర్నగర్ ఎస్హెచ్వో), శ్రీధర్రెడ్డి (ఐటీ సెల్), డి.వెంకన్న నాయక్, రవి కుమార్ (సీసీఎస్ మల్కాజ్గిరి)ను సీపీ మహేష్ భగవత్ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్