కొలువు కోసం వస్తే... ప్రాణం పోయింది
దేశ రక్షణకు సంబంధించిన కొలువులో చేరాలనే తపనతో తన అక్క వివాహ ముహూర్తాన్నే మార్చుకుని... ఎంపిక పరీక్షలకు హాజరైన ఓ యువకుడు ప్రాణాలొదిలిన ఘటనపై శుక్రవారం మల్కాపురం..
నేవీ ఎంపికల్లో కుప్పకూలిన యువకుడు
విశాఖపట్నం : దేశ రక్షణకు సంబంధించిన కొలువులో చేరాలనే తపనతో తన అక్క వివాహ ముహూర్తాన్నే మార్చుకుని... ఎంపిక పరీక్షలకు హాజరైన ఓ యువకుడు ప్రాణాలొదిలిన ఘటనపై శుక్రవారం మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, మృతుడి గ్రామానికి చెందిన వారు తెలిపిన వివరాలివి. తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం ఎలికేశ్వరం గ్రామానికి చెందిన రాళ్లబండి బక్కయ్య, కేదారీశ్వరి దంపతుల కుమారుడు సాయికృష్ణ(19) ఇండియన్ నేవీలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. దేహదారుఢ్య పరీక్ష ఉన్న రోజునే సోదరి వివాహ ముహూర్తం కుదిరింది. పరీక్ష కోసం వివాహ తేదీని డిసెంబరు 9వ తేదీకి మార్చారు.
సాయికృష్ణ తన స్నేహితుడితో కలిసి ఈ నెల 26న విశాఖ చేరుకున్నాడు. ఉదయం 10.30 గంటలకు విశాఖ పైపులైన్ జంక్షన్ వద్ద ఉన్న నేవీ మైదానంలో ఎంపిక పరీక్షలకు హాజరయ్యాడు. తొలుత 100 మీటర్ల పరుగు పూర్తి చేసి, వెంటనే పులప్స్ తీస్తుండగా... కుప్పకూలిపోయాడు. తక్షణమే నేవీ సిబ్బంది ఐఎన్ఎస్ కల్యాణి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటాక మృతి చెందినట్టు వైద్యవర్గాలు ధ్రువీకరించాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్(కింగ్జార్జ్ ఆసుపత్రి)కి తరలించారు. ఈ కేసుని సీఐ కె.దుర్గాప్రసాద్ పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో బాధిత కుటుంబంలో అంతులేని విషాదం అలుముకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.