బంగారు వ్యాపారికి ఝలక్
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన బంగారు వ్యాపారి నుంచి బంగారు బిస్కెట్లను గుర్తుతెలియని వ్యక్తులు లాక్కుపోయారు.
ఒంగోలు నేరవిభాగం: కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన బంగారు వ్యాపారి నుంచి బంగారు బిస్కెట్లను గుర్తుతెలియని వ్యక్తులు లాక్కుపోయారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండులో బుధవారం రాత్రి జరిగిన ఈ వ్యవహారం బంగారు వర్తక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు... జగ్గయ్యపేటకు చెందిన వ్యాపారి ఒకరు కిలో బంగారు బిస్కెట్లను ఆభరణాల తయారీ నిమిత్తం చెన్నై నుంచి తీసుకుని బయలుదేరారు. నెల్లూరు వరకు వేరొక వాహనంలో వచ్చారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో విజయవాడ బయలుదేరారు.
ఒంగోలు బస్టాండుకి రాగానే కొందరు వ్యక్తులు బస్సులోకి ఎక్కి తాము ఐడీ పార్టీ పోలీసులమని, తనిఖీ చేయాలని ఆయనను కిందకు దింపి బంగారు బిస్కెట్లతో ఉడాయించారు. దీంతో అవాక్కయిన వ్యాపారి ఒంగోలులోని వర్తక సంఘం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన సంఘం ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు. ఏ స్టేషన్ నుంచి ఎవరూ ఈ తరహా కేసులో ఎవరి నుంచి బంగారం స్వాధీనం చేసుకోలేదని వారు స్పష్టం చేయగా ఏం జరిగిందో అర్థంకాని అయోమయ పరిస్థితి నెలకొంది. కాగా ఈ విషయం ఒంగోలు గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధి ద్వారా మా దృష్టికి వచ్చిందని డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ తెలిపారు. అసోసియేషన్ ఫిర్యాదు మేరకు పరిశోధన ప్రారంభించామని చెప్పారు. నేర స్థలాన్ని పోలీసులు పరిశీలించారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.