HYD: డ్రగ్స్ కేసుకు ఇక మోక్షం!
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మత్తుమందుల కేసుకు నాలుగేళ్ల తర్వాత మోక్షం లభించనుంది.
సిట్ అభియోగపత్రాలకు కోర్టు ఆమోదం
త్వరలోనే న్యాయవిచారణ ఆరంభం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మత్తుమందుల కేసుకు నాలుగేళ్ల తర్వాత మోక్షం లభించనుంది. దీనిపై త్వరలోనే న్యాయ విచారణ మొదలుకానుంది. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు పూర్తిచేసిన ఆబ్కారీశాఖకు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అభియోగపత్రాలు దాఖలు చేయగా వాటన్నింటినీ న్యాయస్థానం ఆమోదించింది. కరోనా వల్ల న్యాయవిచారణలో జాప్యం జరగడంతో వాయిదా పడింది.
నాలుగేళ్ల క్రితం అంటే 2017 జులై 2న ఆబ్కారీశాఖ అధికారులు నగరానికి చెందిన కెల్విన్ మాస్కెరాన్స్, అబ్దుల్ వహాబ్, అబ్దుల్ ఖుద్దూస్లను అరెస్టు చేసి వారి నుంచి రూ.30లక్షల విలువైన మత్తుమందులను స్వాధీనం చేసుకున్నారు. అనేక మంది సినీ ప్రముఖులు, సాప్ట్వేర్ ఇంజినీర్లు, చివరకు పాఠశాల విద్యార్థులకు కూడా మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు వారు విచారణలో చెప్పడంతో కంగుతిన్న అధికారులు.. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. కేసు తీవ్రత దృష్ట్యా సిట్ ఏర్పాటు చేశారు. మొత్తం 12 కేసులు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 12 మందిని పిలిపించి విచారించారు. అంగీకరించిన వారి నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు సేకరించారు. ఈ కేసుల్లో మొత్తం దాదాపు 30 మందిని అరెస్టు చేయగా 27 మందిని విచారించారు. నమోదు చేసిన 12 కేసులకు తొలుత 8 కేసులలో అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఈ క్రమంలో దర్యాప్తులో జాప్యం జరగటంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రముఖుల ప్రమేయం ఉండటం వల్లనే ఉద్దేశపూర్వకంగా దర్యాప్తు ఆలస్యం చేస్తున్నారని, కేసులు నమోదయి ఏళ్లవుతున్నా అభియోగపత్రాలు దాఖలు చేయకపోవడంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు మిగతా నాలుగు కేసులలోనూ దర్యాప్తు పూర్తిచేయడంతో పాటు సినీ ప్రముఖుల నుంచి సేకరించిన నమూనాలనూ విశ్లేషించి ఆ నివేదికలను కూడా పొందుపరచి అభియోగపత్రాలు దాఖలు చేశారు. వీటన్నింటినీ పరిశీలించిన న్యాయస్థానం ఇటీవల ఆమోదం తెలపటంతో త్వరలోనే మత్తుమందుల కేసు న్యాయవిచారణ మొదలుకానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)