TS Rythu Bheema: రైతుబీమా సొమ్ము కోసం.. వికారాబాద్ జిల్లాలో ఘరానా మోసం
రైతు బీమా కోసం జరిగిన ఓ ఘరానా మోసం వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.
కుల్కచర్ల: రైతు బీమా కోసం జరిగిన ఓ ఘరానా మోసం వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. బీమా సొమ్ము కోసం మహిళ చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించారు. ఈ ఘటన కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పుట్టాపహాడ్కు చెందిన చంద్రమ్మ (58) చనిపోయినట్లు ధ్రువపత్రాన్ని సృష్టించారు. ఆమె పేరున వచ్చిన రూ.5లక్షల బీమా సొమ్మును రైతుబంధు సమన్వయకర్త రాఘవేందర్రెడ్డి కాజేశారు. తమకు రైతుబంధు రావడం లేదంటూ చంద్రమ్మ కుమారుడు బాలయ్య అధికారులను కలవడంతో ఈ విషయం బయటకు వచ్చింది. చంద్రమ్మ చనిపోయినట్లు తమకు ధ్రువపత్రం సమర్పించారని.. బీమా సొమ్ము కూడా తీసుకున్నారని అధికారులు ఆమె కుమారుడికి చెప్పారు. దీంతో బాలయ్య బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా రైతు బీమా డబ్బు వేరొక ఖాతాకు బదిలీ అయ్యాయని అక్కడి సిబ్బంది తెలిపారు. దీంతో రైతుబంధు సమన్వయకర్త రాఘవేందర్రెడ్డిపై బాలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై వ్యవసాయాధికారులు కూడా విచారణ చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సు ఢీకొని.. నలుగురు ఇంటర్ విద్యార్థుల దుర్మరణం
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!