ఫోన్ మాట్లాడుతుందని పొట్టన పెట్టుకున్నారయ్యా..!
తమ కుమార్తె తల్లిదండ్రులతో తరచూ ఫోన్లో మాట్లాడుతుందని అత్తింటివారు ఆమెను పొట్టనపెట్టుకున్నారంటూ ఆరోపిస్తూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు
గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
వెంకటేశ్వర్లు దంపతుల సమస్యను అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్ వివేక్యాదవ్
గుంటూరు నేరవార్తలు, న్యూస్టుడే : తమ కుమార్తె తల్లిదండ్రులతో తరచూ ఫోన్లో మాట్లాడుతుందని అత్తింటివారు ఆమెను పొట్టనపెట్టుకున్నారంటూ ఆరోపిస్తూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని.. తమకు న్యాయం చేయాలని సోమవారం పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల గుండెకోతను అర్ధం చేసుకోవాలని సత్యవాణి, రాజగోపాల్ దంపతులు వేడుకున్నారు. స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించారు. అనంతరం బాధితులు విలేఖరులతో మాట్లాడారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..‘మేము పాత గుంటూరులో ఉంటున్నాం. మాకు ఆడపిల్ల లేకపోవడంతో మా సోదరికి కవల పిల్లలు పుడితే సాయి ప్రవళ్లిక (24)ను చిన్నతనంలో దత్తతతీసుకొని పెంచిపెద్ద చేశాం. బీకాం చదివించి మూడేళ్ల కిందట ఓ కళాశాలలోని అధ్యాపకునితో వివాహం చేశాం. వారికి ఒక పాప. ఈ క్రమంలో జూన్ 21న మా పాప చనిపోయిందని సమాచారం వచ్చింది. గుంటూరులోని ఆమె ఇంటికి వెళ్లి చూస్తే శరీరం సగం కాలిపోయి విగతజీవిగా పడి ఉంది. అది చూసిన తమకు గుండె ఆగినంతపనైంది. అదేమని అడిగితే ఆత్మహత్య చేసుకుందంటున్నారు. శానిటైజర్, నువ్వుల నూనెతో తగలబెట్టి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను హత్య చేసి పైగా ఆమె పిచ్చిదని నమ్మించి నేరస్థులు తప్పించుకోవాలని చూస్తున్నారు. శవ పరీక్ష నివేదిక వస్తే హత్యా, ఆత్మహత్యా అనేది స్పష్టత వస్తుందని పోలీసులు అంటున్నారు. ఘటన జరిగి 40 రోజులు గడుస్తున్నా ఇంతవరకు నివేదిక రాలేదంటున్నారు. తమ కూతురు మృతి మిష్టరీ ఛేదించి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని కోరుతున్నా’మని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు