AP News: ఆ ఫోన్కాల్.. మృత్యుపాశమైంది
సరదాగా స్నానానికి వెళ్దామని స్నేహితుడు ఫోన్ చేయడంతో వెళ్లిన ఆ బాలుడు ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. నదిలో గల్లంతై నిర్జీవంగా పైకి తేలాడు. దీంతో ఆ నిరుపేద కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చేతికందొచ్చిన కొడుకు దూరమవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. సీతానగరం మండలంలోని ఇనుగంటివారిపేటకు
గోదావరిలో గల్లంతైన యువకుడి విషాదాంతం
సీతానగరం, న్యూస్టుడే: సరదాగా స్నానానికి వెళ్దామని స్నేహితుడు ఫోన్ చేయడంతో వెళ్లిన ఆ బాలుడు ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. నదిలో గల్లంతై నిర్జీవంగా పైకి తేలాడు. దీంతో ఆ నిరుపేద కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చేతికందొచ్చిన కొడుకు దూరమవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. సీతానగరం మండలంలోని ఇనుగంటివారిపేటకు చెందిన సలాది మణికంఠ(17) ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి గోదావరి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతిచెందాడు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..స్నేహితుల దినోత్సవం కావడంతో ఆ రోజంతా స్నేహితులతో కలిసి సాయంత్రం వరకు ఆనందంగా గడిపాడు. ఈ క్రమంలో స్నానానికి వెళదామంటూ స్నేహితుడు విజయకుమార్ ఫోన్ చేయడంతో ఇంట్లో నిద్రిస్తున్న మణికంఠ లేచి.. మరో స్నేహితుడు శంకరంతో కలిసి మునికూడలి-రాజంపేటకు మధ్యలో ఉన్న నదిలో స్నానానికి దిగారు. ఆ ప్రాంతమంతా గోతులు ఉండడం, ప్రవాహ వేగానికి మణికంఠ స్నేహితుల కళ్ల ముందే కొట్టుకుపోయాడు. చుట్టుపక్కలవారు వెంటనే స్పందించి పొడవైన కర్రలు అందించడంతో మిగిలిన ఇద్దరు బయటపడ్డారు. రాత్రయినా కొడుకు ఇంటికి రాకపోవడంతో ఆరా తీస్తే నదిలో గల్లంతయినట్లు తెలిసింది. సోమవారం ఉదయం నుంచి సీతానగరం తహసీల్దారు ఎన్ఎస్ పవన్కుమార్, ఎస్సై వై.సుధాకర్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం, కాకినాడ నుంచి అగ్నిమాపక, ఎస్జీఆర్ఎఫ్ బృందాలను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం 6 గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.
చెల్లెల్ని చదివించాలని..
మణికంఠ తండ్రి వీరవెంకట సత్యనారాయణ తాపీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తల్లి వెంకటలక్ష్మి ఒక ప్రైవేటు పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్నారు. పదో తరగతి పూర్తిచేసిన మణికంఠ ఇంటర్ చదవాలనే ఆశ ఉన్నా చెల్లెలు కీర్తి(12) చదువు కోసం తన చదువు ఆపేశాడు. మోటార్ సైకిల్ మెకానిక్ దగ్గర పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. తాను చదవకపోయినా చెల్లిని ఉన్నతస్థితిలో నిలబెట్టాలని తరచూ తమతో అనేవాడని చెబుతూ తల్లిదండ్రులు విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ