Visakhapatnam: అమానవీయం.. శిశువు బతికి ఉండగానే ఖననానికి యత్నం!
ముక్కుపచ్చలారని శిశువును బతికి ఉండగానే పూడ్చేయాలని కోరుతూ విశాఖపట్నంలోని జ్ఞానాపురం శ్మశాన వాటికకు నలుగురు వ్యక్తులు వచ్చిన ఘటన కలకలం రేపింది...
విశాఖ నగరం జ్ఞానాపురంలో ఘటన..
విశాఖ: ముక్కుపచ్చలారని శిశువును బతికి ఉండగానే పూడ్చేయాలని కోరుతూ విశాఖపట్నంలోని జ్ఞానాపురం శ్మశాన వాటికకు నలుగురు వ్యక్తులు వచ్చిన ఘటన కలకలం రేపింది. విశాఖ కాన్వెంట్ జంక్షన్లోని హిందూ శ్మశాన వాటికకు శనివారం సాయంత్రం ఓ కారులో నలుగురు వ్యక్తులు వచ్చారని.. కవర్లో ఉంచిన శిశువును పాతిపెట్టాలని కోరారని శ్మశాన వాటిక సిబ్బంది తెలిపారు. పాతిపెట్టేందుకు కవర్ తెరవగా శిశువు ఏడవటం ప్రారంభించిందన్నారు. బతికి ఉండగానే ఎందుకు ఖననం చేస్తున్నారని ప్రశ్నించగా.. ఆ నలుగురు వ్యక్తులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారని సిబ్బంది తెలిపారు. సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వాళ్లు దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. ప్రస్తుతం శిశువును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. దీనిపై కంచరపాలెం పోలీసులకు శ్మశాన వాటిక సిబ్బంది ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా