Rajasthan: భర్త ఎదుటే భార్యపై ముగ్గురు అత్యాచారం

భర్త ఎదుటే ఓ వివాహితపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన

Updated : 12 Aug 2021 10:02 IST

బాడ్మెర్‌: భర్త ఎదుటే ఓ వివాహితపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. భార్యాభర్తలు బైక్‌పై వెళుతుండగా అడ్డగించిన దుండగులు ఈ దురాగతానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రాజస్థాన్‌ బాడ్మెర్‌కు చెందిన దంపతులు మంగళవారం బలోత్రాకు బైక్‌ మీద బయలుదేరారు. వీరిని మార్గమధ్యంలో నలుగురు దుండగులు అడ్డగించారు. నిందితుల్లో ఒకరు బాధిత మహిళ భర్త వాహనాన్ని తీసుకుని ఉడాయించారు. మిగిలిన ముగ్గురు ఆమె భర్తను తీవ్రంగా కొట్టారు. తర్వాత భార్యాభర్తలిద్దరినీ బలవంతంగా కారులో ఎక్కించారు. కారులో ఎక్కగానే ముగ్గురూ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు వివరించారు. ముగ్గురు నిందితులు కమ్తాయ్, బాబులాల్, నరేష్‌లను అరెస్టు చేసినట్లు బాడ్మెర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ ఆనంద్‌ శర్మ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని