Allahabad high court: బాధితుల హక్కుల్నీ పరిగణించాకే బెయిల్
తీవ్రమైన కేసుల్లో నిందితులకు బెయిల్ మంజూరు చేసే ముందు బాధితులు, వారి కుటుంబీకుల హక్కుల్నీ పరిగణనలో తీసుకోవాలని అలహాబాద్ ...
తీవ్రమైన కేసుల్లో అలా చేయడం మేలు
అలహాబాద్ హైకోర్టు ప్రమాణ పత్రం
దిల్లీ: తీవ్రమైన కేసుల్లో నిందితులకు బెయిల్ మంజూరు చేసే ముందు బాధితులు, వారి కుటుంబీకుల హక్కుల్నీ పరిగణనలో తీసుకోవాలని అలహాబాద్ హైకోర్టు అభిప్రాయపడింది. బాధితులతో సంప్రదించి ‘బాధితుల ప్రభావ అంచనా’ నివేదికను రప్పించాల్సి ఉందని సూచించింది. భౌతికంగా, మానసికంగా, సామాజికంగా సంబంధిత నేరం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, నిందితుడికి బెయిల్ ఇస్తే దాని ప్రభావం బాధితులపై ఎంతమేరకు ఉంటుంది అనే వివరాలన్నీ ఈ నివేదికలో స్పష్టంగా ఉండాలంది. శిక్ష పడిన ముద్దాయిల బెయిల్ దరఖాస్తుల విషయంలో విధి విధానాల రూపకల్పనకు సహాయపడాల్సిందిగా సుప్రీంకోర్టు చేసిన సూచన మేరకు అలహాబాద్ హైకోర్టు ఒక ప్రమాణపత్రాన్ని సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది. సగానికి పైగా శిక్షా కాలం పూర్తయిన ముద్దాయిల క్రిమినల్ అప్పీళ్ల విచారణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఘరానా నేరాలకు పాల్పడిన వారి విషయంలో నిబంధనలు విడిగా ఉండడం మేలని అభిప్రాయపడింది. అవసరమైతే ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేయాలంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఈ అఫిడవిట్ను పరిశీలించే అవకాశాలున్నాయి.
నిబంధనల మేరకే పుట్టిన తేదీ మార్పు
పుట్టిన తేదీలో మార్పు చేయాలంటూ వచ్చే దరఖాస్తుల్ని నిబంధనల మేరకే పరిశీలించాలని, బలమైన ఆధారాలున్నప్పటికీ వాటిని హక్కుగా కోరడం తగదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆలస్యంగా, ముఖ్యంగా పదవీ విరమణకు కొద్దికాలం ముందు వచ్చే దరఖాస్తుల్ని తిరస్కరించవచ్చని జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ ఎ.ఎస్.బోపన్నల ధర్మాసనం మంగళవారం తేల్చిచెప్పింది. ఒక ఉద్యోగి పుట్టిన తేదీ మార్పు విషయంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీలుపై ధర్మాసనం విచారణ జరిపింది.
దావా కారణం చెప్పకపోతే కేసుల్ని తిరస్కరించవచ్చు
దావా వేయడానికి కారణాన్ని వెల్లడించకపోతే అలాంటి సివిల్ కేసులను తిరస్కరించవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది తీవ్రమైన చర్యే అయినప్పటికీ బూటకపు వ్యాజ్యాలను అడ్డుకునేందుకు అలా చేయడం అవసరమని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ బి.ఆర్.గవాయ్ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోర్టుల విలువైన సమయాన్ని మరింత వృథా కానివ్వకుండా చూడాలంటే ఇది తప్పదని ఒక కేసు విచారణ సందర్భంగా పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు