DRDO Secret Leak: డీఆర్డీఓ రహస్యాల లీకేజీ వెనుక మహిళ
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా చాందీపూర్లోని డీఆర్డీఓ రహస్యాల లీకు ఘటన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి...
క్రైమ్బ్రాంచి ఏడీజీ సంజీబ్ పండా వెల్లడి
కటక్: ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా చాందీపూర్లోని డీఆర్డీఓ రహస్యాల లీకు ఘటన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఇప్పటికే అరెస్టు చేసిన అయిదుగురు వ్యక్తులను ఒడిశా క్రైమ్బ్రాంచి అధికారులు రిమాండ్కు తీసుకొని నాలుగు రోజులుగా విచారిస్తున్నారు. మంగళవారం ఏడీజీ సంజీబ్ పండా మీడియాతో మాట్లాడుతూ.. ‘నిందితుల్లో ఒకరి బ్యాంకు ఖాతాకు దుబాయ్ నుంచి రెండు విడతల్లో రూ.38,000 వచ్చినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. నిందితులు ఓ మహిళతో ఫేస్బుక్లో చాటింగ్ చేశారు. ఆమె యూకేకు చెందిన సెల్ఫోన్ నంబరు ద్వారా ఫేస్బుక్, వాట్సాప్లో సంభాషించింది. ఆమె ద్వారా ఉత్తర్ప్రదేశ్కు చెందిన వ్యక్తుల (హ్యాండ్లర్ల)తో పరిచయం ఏర్పడింది. హ్యాండ్లర్లకు రహస్యాలు పంపినందుకు ఈ అయిదుగురు డీల్ కుదుర్చుకున్నారు. సదరు మహిళ వేర్వేరు పేర్లతో దేశంలోని వివిధ ప్రాంతాల వారితో ఛాటింగ్ చేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. నిందితుల సోల్ఫోన్లు స్వాధీనం చేసుకొని, వివరాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాం. దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో భారత వైమానిక దళానికి చెందిన అధికారులు కటక్ చేరుకొని రెండు రోజులపాటు నిందితులను వేర్వేరుగా ప్రశ్నించారు’ అని తెలిపారు.
బంగ్లాదేశ్ వలసదారులపై అనుమానం..
క్రైమ్ బ్రాంచి అధికారి ఒకరు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. అయిదుగురు నిందితులు ఉత్తర్ప్రదేశ్కు చెందిన వ్యక్తుల ఆధీనంలో ఉండేవారని, అతడి ఆదేశాల మేరకు రహస్యాలు సేకరించి పంపేవారని, వారు నగదు జమ చేసేవారని తెలిపారు. నగదు లావాదేవీలు పాకిస్థాన్, బంగ్లాదేశ్లోని స్లీపర్సెల్స్ ద్వారా జరిగేవని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చి బాలేశ్వర్లో ఉంటున్న వలసదారులు వారికి సమాచారం చేరవేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. నిందితుల బ్యాంకు ఖాతాలకు జరిగిన లావాదేవీలపై దర్యాప్తు ప్రారంభించారని, అవసరమైతే దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారుల సహాయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.