
భర్తపై అనుమానం.. జిమ్లో మహిళను చితకబాదిన భార్య
భోపాల్: భర్తతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో అతడి భార్య ఓ మహిళపై వ్యాయామశాలలో బూట్లతో దాడికి దిగింది. పక్కనున్నవారు ఆపడానికి ప్రయత్నించినా శాంతించకుండా విచక్షణారహితంగా విరుచుకుపడింది. ఆమె ఎవరో తనకు తెలియదని భర్త ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. చివరికి భార్యాభర్తలిద్దరూ పోలీస్ స్టేషన్కు వెళ్లి పరస్పరం కేసులు పెట్టుకున్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 15న జరిగిన ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
30 ఏళ్ల ఆ మహిళ బుర్ఖా ధరించి తన సోదరితో కలసి ఓ జిమ్కు వచ్చింది. అక్కడ వ్యాయామాలు చేస్తున్న భర్త పక్కన ఉన్న మహిళను చూసింది. భర్తతో ఆమెకు సంబంధం ఉందని అనుమానించింది. ఈ విషయమై అతడితో గొడవకు దిగి.. ఆ మహిళపై ఒక్కసారిగా దాడికి పాల్పడింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.