Crime News: కాళ్లు నరికి కడియాలు దొంగలించారు

రాజస్థాన్‌లో దారుణ హత్య జరిగింది. 55 ఏళ్ల మహిళను

Published : 21 Oct 2021 12:12 IST

జైపుర్‌లో మహిళ దారుణహత్య..

ఈనాడు, జైపుర్‌: రాజస్థాన్‌లో దారుణ హత్య జరిగింది. 55 ఏళ్ల మహిళను కిరాతకంగా హత్యచేశారు. అంతేకాకుండా ఆమె కాళ్లు నరికేసి, వాటికున్న వెండి కడియాలు దొంగిలించారు. జైపుర్‌లోని జామ్‌ వార్ముగఢ్‌లో మంగళవారం ఈ దారుణం జరిగింది. ఆమె మృతదేహం లభ్యమైన చోటే బుధవారం కుటుంబసభ్యులు ఆందోళన నిర్వహించారు. 

గ్రామస్థులు కూడా వారికి మద్దతుగా నిలిచారు. గ్రామానికి చేరుకున్న కలెక్టర్‌ మృతురాలి కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని