Telugu Akademi Scam: నిందితులు కొనుగోలు చేసిన ఆస్తుల గుర్తింపు
తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల గోల్మాల్ వ్యవహారంలో షిర్డీకు చెందిన మదన్ను నగర సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. కేసులో నిందితురాలు, కెనరా బ్యాంకు...
తెలుగు అకాడమీ ఎఫ్డీల గోల్మాల్ వ్యవహారంలో మరొకరి అరెస్ట్
ఈనాడు, హైదరాబాద్: తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల గోల్మాల్ వ్యవహారంలో షిర్డీకు చెందిన మదన్ను నగర సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. కేసులో నిందితురాలు, కెనరా బ్యాంకు మాజీ మేనేజర్ సాధన భర్త బాబ్జీకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. తాజాగా అరెస్టయిన మదన్.. కీలక నిందితుడు సాయికుమార్కు ప్రాణస్నేహితుడు. ఇతడి ద్వారానే విశాఖపట్నానికి చెందిన సాంబశివరావుతో సంప్రదింపులు జరిపించారు. మధ్యవర్తిత్వం నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. వీరు ఎప్పుడు షిర్డీ వెళ్లినా అక్కడ అవసరమైన సౌకర్యాలు కల్పించేవాడు. ముగ్గురూ కలిసి రూ.64.05 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు కొట్టేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. గతేడాది డిసెంబరులోనే తెలుగు అకాడమీ సొమ్ము కాజేసేందుకు తెలివిగా వ్యూహరచన చేశారు. అనంతరం తమకు అనుకూలమైన వ్యక్తులను సహకారంతో వ్యవహారం నడిపించారు. కోట్లాది రూపాయలు చేతికి అందగానే వాటాలు పంచుకున్నారు. ఆనక భారీగా ఆస్తులు కూడబెట్టారు. కేసును సవాల్గా తీసుకున్న నగర సీసీఎస్ పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. రూ.64.05 కోట్లలో ఇప్పటివరకు రూ.20 కోట్లు స్వాధీనం చేసుకొని.. 17 మందిని అరెస్ట్ చేశారు. తెరవెనుక నుంచి నిందితులకు సహకరించిన కొందరు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. సీసీఎస్ పోలీసులు మాత్రం కేసుతో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ వదలబోమని స్పష్టం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన మరికొందరిని అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కేసులో కీలకమైన ఆధారాలు రాబట్టేందుకు సాంబశివరావు కస్టడీకు కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం.
రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ లేఖ..
అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల గోల్మాల్లో నగర సీసీఎస్ పోలీసులు రూ.20 కోట్లు తిరిగి రాబట్టారు. ఇందులో రూ.3 కోట్ల నగదు, రూ.16 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. ఈ ఆస్తిపాస్తుల క్రయవిక్రయాలు జరగకుండా ఏపీ, తెలంగాణ స్టాంపులు/రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాయనున్నారు.
గుర్తించిన ఆస్తులివే..
కేసులో కీలక సూత్రదారి సాయికుమార్ పెద్దఅంబర్పేట్(ఔటర్ రింగ్రోడ్డు) సమీపంలో రూ.100 కోట్ల విలువైన 30 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. ఇది వివాదంలో ఉన్నా ఈసీ ప్రతి చూపి సొంతం చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.
* బ్యాంకు మాజీ మేనేజర్ మస్తాన్వలీ తన వాటాగా రూ.2.5 కోట్లు తీసుకున్నాడు. వీటితో నగరంలో ఖరీదైన ప్రాంతంలో ఒక ప్లాటు, యూసుఫ్గూడలో మరో ప్లాటును కొనుగోలు చేశాడు.
* కెనరా బ్యాంకు మాజీ మేనేజర్ సాధన రూ.1.99 కోట్లు స్వాహా చేశారు. ఈ మొత్తంతో శంకరంపల్లి వద్ద రూ.1.20 కోట్ల విల్లా, విశాఖపట్నంలోని ఖరీదైన ప్రాంతంలో ఫ్లాటు కొనుగోలు చేశారు.
* నండూరి వెంకటరమణ ఏపీలోని తణుకులో 41 సెంట్ల స్థలంలో బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు. విశాఖ, విజయనగరం జిల్లాల్లోనూ స్థలాలు కొనుగోలు చేశాడు.
* వైజాగ్కు చెందిన సాంబశివరావు తన వాటాగా రూ.55 లక్షలు తీసుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్