వీసాలు, అమెరికాలో ఉద్యోగాలంటూ.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ల నుంచి రూ.4 కోట్లు వసూలు
అమెరికా వెళ్లేందుకు వీసాలతోపాటు బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లను మోసం చేస్తున్న ఘరానా నిందితుడు తిప్పులరెడ్డి భాస్కర్రెడ్డిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
భాస్కర్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: అమెరికా వెళ్లేందుకు వీసాలతోపాటు బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లను మోసం చేస్తున్న ఘరానా నిందితుడు తిప్పులరెడ్డి భాస్కర్రెడ్డిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అమీర్పేటలో డొమైన్ నెట్వర్క్ జోన్ పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న భాస్కర్రెడ్డి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు అమెరికాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.4 కోట్లు వరకు వసూలు చేశాడు. రెండు నెలల క్రితం కన్సల్టెన్సీకి తాళమేసి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన ఎస్సై మహేశ్, చిత్తూరు జిల్లాలో ఉన్నాడని తెలుసుకొనిపుత్తూరులో పట్టుకొన్నారు. స్థానిక కోర్టులో హాజరుపరచి హైదరాబాద్కు తీసుకొచ్చి సోమవారం జైలుకు తరలించారు.
చిత్తూరు జిల్లా ముడియంవారిపల్లికి చెందిన తిప్పులరెడ్డి భాస్కర్రెడ్డి పదిహేడేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చి అమీర్పేటలో డొమైన్ నెట్వర్క్ జోన్ పేరుతో శిక్షణ సంస్థను ప్రారంభించాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు జావా, సాప్ లాంటి కోర్సుల్లో శిక్షణ ఇచ్చేవాడు. వీసాలూ ఇప్పిస్తే కమీషన్ వస్తుందని తెలుసుకోవడంతో ఆరేళ్ల క్రితం డొమైన్ కన్సల్టెన్సీ పేరుతో వీసా ఏజెంట్గా మారాడు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఉద్యోగాలిప్పిస్తున్న అమెరికా సంస్థల గురించి తెలుసుకున్నాడు. విదేశీ సంస్థల్లో ఉద్యోగాలు, ఎల్-1, ఇతర వీసాలతోపాటు గ్రీన్కార్డు పొందేందుకు సాయం చేస్తానంటూ చెప్పేవాడు. రూ.లక్షల్లో కమీషన్ తీసుకునేవాడు. హైదరాబాద్లో ఉంటున్న టి.కృష్ణప్రసాద్ నుంచి రూ.2.70 కోట్లు వసూలు చేసి మోసం చేశాడు. కృష్ణప్రసాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై మహేశ్ వివరాలు సేకరించారు. మరొకరి నుంచి రూ.1.30 కోట్లు తీసుకున్నాడని తెలుసుకున్నారు. వీరిద్దరితోపాటు మరికొందరు బాధితులున్నారని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ