TS News: లంచాలన్నీ మంచాల కిందే..!
సంగారెడ్డి జిల్లా భూకొలతల శాఖ సహాయ సంచాలకుడు మధుసూదన్రావు కొద్దిరోజుల క్రితం రూ.20 వేలు లంచం తీసుకుంటూ
ఇళ్లలోనే కట్టలు కట్టలుగా ఆమ్యామ్యాల పైకం
అక్రమార్కుల నయా పంథా
ఈనాడు, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా భూకొలతల శాఖ సహాయ సంచాలకుడు మధుసూదన్రావు కొద్దిరోజుల క్రితం రూ.20 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ బృందానికి చిక్కారు. అనంతరం హైదరాబాద్ ఉప్పల్లోని అతడి ఇంట్లో సోదాలు చేయగా.. ఏకంగా రూ.1.03 కోట్ల నగదు, 314.77 గ్రాముల బంగారు ఆభరణాలు, మరో రూ.95.55 లక్షల ఆస్తి దస్తావేజులు లభించాయి. పెద్ద సంఖ్యలో కవర్లలో రోజుల తరబడి పోగుపడి ఉన్నట్లుగా కనిపించిన సొమ్మంతా లంచాల ద్వారా వచ్చినదేనని తేలడంతో అధికారులు విస్తుపోయారు.
..ఆమ్యామ్యా మేత మేస్తున్న అక్రమార్కులు రూటు మార్చినట్లుగా కనిపిస్తోంది. అప్పటికప్పుడు అక్రమాస్తులు పోగేయడం కంటే.. చేతివాటం ప్రదర్శించి దండుకున్న సొమ్మును ప్రస్తుతానికి దాచేయడమే మంచిదనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారని తాజా ఉదంతాలు స్పష్టంచేస్తున్నాయి. గతంలో అయితే లంచాల సొమ్ముతో ఎక్కువగా అక్రమాస్తులు పోగేసుకునేవారు. బినామీల పేరిట ఆస్తులు కొనుగోలు చేసేవారు. అయితే, ఈ వ్యవహారాల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయని.. ఇళ్లలోనే అక్రమార్జనను పోగేస్తున్నట్లుగా కనిపిస్తోందని ఈ కేసులు పర్యవేక్షిస్తున్న సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఒకసారి అనిశాకి చిక్కితే చాలు బినామీలు ఎదురుతిరుగుతుండటంతో లంచావతారులు రూటు మార్చినట్లు అనిపిస్తోందన్నారు. మొత్తంమీద అక్రమార్కులు దోచుకున్న సొమ్మునంతా తమ ఇళ్లలో లేదంటే రక్తసంబంధీకుల నివాసాల్లో దాచేస్తున్నట్లు పలు ఉదంతాలు స్పష్టంచేస్తున్నాయి.
తహశీల్దార్ ఇంట్లో అవినీతి కట్టలు
2019 జులైలో రంగారెడ్డి జిల్లా కేశంపేట తహశీల్దార్ లావణ్య అనిశాకి చిక్కారు. ఆమె కోసం వీఆర్వో అనంతయ్య ఓ రైతు నుంచి రూ.4 లక్షల లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకొన్నారు. అనంతరం హయత్నగర్లోని లావణ్య ఇంట్లో సోదాలు చేయగా ఏకంగా రూ.93.5 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం లభ్యమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM