Crime News: ముఖ రతి నేరమే.. తీవ్రమైనది కాదు!
చిన్నారులతో ముఖ రతిని అత్యంత తీవ్ర నేరంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ..
దోషికి విధించిన శిక్షను పదేళ్ల నుంచి ఏడేళ్లకు తగ్గించిన అలహాబాద్ హైకోర్టు
అహ్మదాబాద్: చిన్నారులతో ముఖ రతిని అత్యంత తీవ్ర నేరంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. సెషన్స్ కోర్టు దోషికి విధించిన 10ఏళ్ల జైలు శిక్షను 7 ఏళ్లకు తగ్గించింది. రూ.5,000 జరిమానా విధించింది. అయితే, ఇలాంటి నేరాలు శిక్షార్హమైనవేనని హైకోర్టు స్పష్టం చేసింది. బాలుడితో ముఖ రతి చేయించుకున్న వ్యక్తిని దోషిగా తేల్చిన సెషన్స్ కోర్టు పోక్సో చట్టంలోని సెక్షన్ 6, 10 ప్రకారం 10ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును ముద్దాయి హైకోర్టులో సవాల్ చేశాడు. దీన్ని విచారించిన ధర్మాసనం ముఖ రతి నేరమే కానీ, అత్యంత తీవ్రమైనది కాదని పేర్కొంది. దీనికి పోక్సో చట్టంలోని సెక్షన్ 4 వర్తిస్తుందని, సెక్షన్ 6, 10 వర్తించవని చెప్పింది. ఈ సెక్షన్ ప్రకారం దోషికి కనీసంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసు వివరాల ప్రకారం ఫిర్యాదుదారుడి ఇంటికి నిందితుడు వెళ్లాడు. అతని పదేళ్ల కుమారుడిని బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడు ఆ విషయాన్ని ఇంటి వద్ద ఉన్న పెద్దలకు తెలపడంతో వారు కేసు పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
-
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268
-
స్పీకర్ తమ్మినేని కోటకు బీటలు!
-
నా భార్యకు ఏమైనా అయితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్