బిల్లు కట్టమంటే బాదేశారు

పెండింగ్‌ ఉన్న విద్యుత్తు బిల్లు కట్టమన్నందుకు పలువురు లైన్‌మెన్‌పై దాడి చేసిన సంఘటన మండలంలోని బొంతగుంట్ల ఎస్సీ కాలనీలో శుక్రవారం జరిగింది. ఎస్సై టి.రాజ్‌కుమార్‌ కథనం మేరకు గ్రామానికి చెందిన కంచర్ల యోహాన్‌ రూ.1,800 విద్యుత్తు బిల్లు కట్టాల్సి ఉంది. శుక్రవారం వారి ఇంటికి

Updated : 27 Nov 2021 05:40 IST


లైన్‌మెన్‌ శివారెడ్డిపై దాడి చేస్తున్న కుటుంబ సభ్యులు

వెలిగండ్ల, న్యూస్‌టుడే: పెండింగ్‌ ఉన్న విద్యుత్తు బిల్లు కట్టమన్నందుకు పలువురు లైన్‌మెన్‌పై దాడి చేసిన సంఘటన మండలంలోని బొంతగుంట్ల ఎస్సీ కాలనీలో శుక్రవారం జరిగింది. ఎస్సై టి.రాజ్‌కుమార్‌ కథనం మేరకు గ్రామానికి చెందిన కంచర్ల యోహాన్‌ రూ.1,800 విద్యుత్తు బిల్లు కట్టాల్సి ఉంది. శుక్రవారం వారి ఇంటికి వెళ్లి బకాయి కట్టాలని లైన్‌మెన్‌ శివారెడ్డి కోరారు. తాము పేదవాళ్లమని, అంత డబ్బు లేదని, బిల్లు చెల్లించమని తెలపడంతో వెంటనే ఆయన విద్యుత్తు సరఫరా కట్‌ చేశారు. దీంతో ఆగ్రహించిన యోహాన్‌ కుటుంబసభ్యులు లైన్‌మెన్‌పై దాడి చేసి గాయపరిచారు. పక్కనే ఉన్న ఏఈఈ రసూల్‌, ఇతర సిబ్బంది పైనా దురుసుగా ప్రవర్తించారు. శివారెడ్డిని కనిగిరి కమ్యూనిటీ వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. విద్యుత్తు శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని