Crime News: పెళ్లి సందట్లో.. భారీ చోరీ

రాజస్థాన్‌లోని ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ. 2 కోట్ల విలువైన వజ్రాల నగలతో పాటు, రూ. 95 వేల

Published : 27 Nov 2021 10:54 IST

రూ. 2 కోట్ల వజ్రాభరణాలు, రూ. 95 వేల నగదు అపహరణ

జైపుర్‌: రాజస్థాన్‌లోని ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ. 2 కోట్ల విలువైన వజ్రాల నగలతో పాటు, రూ. 95 వేల నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. జైపుర్‌లో గురువారం ఈ దొంగతనం జరిగింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. ముంబయికి చెందిన వ్యాపారి రాహుల్‌ భాటియా కుమార్తె వివాహాన్ని ఈ హోటల్‌లో నిర్వహిస్తుండగా.. ఆ కుటుంబం ఏడో అంతస్తులోని ఓ గదిలో బస చేసింది. వారంతా హోటల్‌ ప్రాంగణంలో పెళ్లి వేడుకకు వెళ్లిన సమయంలో చోరీ జరిగింది. హోటల్‌ సిబ్బంది సహకారంతోనే ఈ దొంగతనం జరిగి ఉండొచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ భాటియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని