ఒక్కగానొక్క బిడ్డను కబళించిన మృత్యువు
ఆ దంపతులకు ఉన్న ఒక్కగానొక్క బిడ్డ. అపురూపంగా పెంచుకుంటూ.. ఉన్నత చదువులు చదివించాలని, కొడుకును మంచి కొలువులో చూడాలని వారి కోరిక. అది నెరవేరకముందే ఆ యువకుడిని రోడ్డు ప్రమాద రూపంలో
అభిషేక్
ఆత్మకూరు, న్యూస్టుడే: ఆ దంపతులకు ఉన్న ఒక్కగానొక్క బిడ్డ. అపురూపంగా పెంచుకుంటూ.. ఉన్నత చదువులు చదివించాలని, కొడుకును మంచి కొలువులో చూడాలని వారి కోరిక. అది నెరవేరకముందే ఆ యువకుడిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించడంతో ఆ ఇంట కన్నీరే మిగిలింది. వివరాల్లోకి వెళితే..వరంగల్ జిల్లా కొత్తపేట గ్రామశివారు ఆత్మకూరు పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో వరంగల్ శంభునిపేటకు చెందిన శ్రీపాద రామాచారి కుమారుడు అభిషేక్(18) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ బట్టలబజార్కు చెందిన తిరుమలగిరి శ్రీకర్(16), శివనగర్కు చెందిన ఎనుపోతుల అభినవ్(18), అభిషేక్(18) ముగ్గురు స్నేహితులు. పోచమ్మ మైదాన్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. శనివారం వారు ఓ ద్విచక్ర వాహనంపై కొత్తపేట నుంచి వరంగల్ వైపు వేగంగా వెళ్తున్నారు. వరంగల్ నుంచి కొత్తపేట వైపు టిప్పర్ వేగంగా వస్తోంది. రెండు బళ్లు వేగంగా వస్తుండటం, అదుపులోకి రాకపోవడంతో రెండూ ఢీకొన్నాయి. ద్విచక్ర వాహనం కిందపడి పోగా టిప్పర్ అభిషేక్పై నుంచి టిప్పర్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రీకర్, అభినవ్కు తీవ్రంగా గాయాలు కావడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అభిషేక్ మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!