ఏకే రావు మృతి కేసులో వీడని గుట్టు
కన్నడ, తెలుగు నేపథ్య గాయని హరిణిరావు తండ్రి ఏకే రావు మృతి కేసు కొత్తమలుపులు తిరుగుతోంది. ఆయన మృతదేహానికి సంబంధించిన శవపరీక్ష నివేదిక కోసం రైల్వే పోలీసులు ఎదురుచూస్తుంటే..
ఈనాడు డిజిటల్, బెంగళూరు: కన్నడ, తెలుగు నేపథ్య గాయని హరిణిరావు తండ్రి ఏకే రావు మృతి కేసు కొత్తమలుపులు తిరుగుతోంది. ఆయన మృతదేహానికి సంబంధించిన శవపరీక్ష నివేదిక కోసం రైల్వే పోలీసులు ఎదురుచూస్తుంటే.. ఆయనపై వంచన కేసులు నమోదు చేసుకున్న బెంగళూరు ఆగ్నేయ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఆగ్నేయ డీసీపీ శ్రీనాథ్ జోషి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏకే రావు పేరిట ఉన్న లోన్ కన్సల్టెన్సీ కంపెనీ ద్వారా రుణాలిస్తామని నమ్మించిన ఫైనాన్షియర్లు డేనియల్ ఆమ్స్ట్రాంగ్, వివేకానంద కుమార్, రవి రాఘవన్ కలిసి బెంగళూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి పి.గిరీష్ నుంచి రూ.2.3 కోట్లు, అరుణాచల్ప్రదేశ్కు చెందిన వ్యాపారి తరమ్ నుంచి రూ.3.6కోట్లు వసూలు చేశారు.ఆ తర్వాత వారి నుంచి స్పందన లేకపోవటంతో బాధితులు ఏకే రావును నిలదీశారు. ఈ విషయంలో తానూ మోసపోయానని రావు చెప్పినా, వినని బాధితులు ఈనెల 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏకేరావు, ఆయన మిత్రుడు మరాళి, 22న విచారణకు హాజరయ్యారు. ఆ మరుసటి రోజు ఉదయమే ఏకేరావు మృతి చెందారు.
కూతురు ఇంటికని చెప్పి
ఈ నెల 8న బెంగళూరుకు వచ్చిన ఏకేరావు, జీఎం పాళ్యలోని తన చిన్న కుమార్తె శాలినీరావు ఇంట్లో 13వ తేదీ వరకు ఉన్నారు. అనంతరం రెసిడెన్సీ రోడ్డులోని చాన్సరీ పెవిలియన్ హోటల్లో దిగారు. అక్కడి నుంచే, మరాళితో కలిసి సుద్దగుంట పాళ్య పోలీసుల విచారణకు హాజరయ్యారు. 22న విచారణ ముగియగా, అదే రోజు రాత్రి కుమార్తె వద్దకని చెప్పి యలహంకకు క్యాబ్లో వెళ్లారు. ఏకే రావు యలహంకకు వెళ్తాడన్న సంగతి తనకు తెలియదని మరాళి పోలీసులకు చెప్పారు. సోమవారం శవపరీక్ష నివేదిక వచ్చే అవకాశం ఉందని యలహంక రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శివకుమార్ వివరించారు. ఏకే రావు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకే హత్య కేసు నమోదు చేశామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!