ప్రేమ పెళ్లి కాదన్నారని.. తనువు చాలించిన యువకుడు

ప్రేమ పెళ్లి కాదన్నారన్న ఉద్దేశంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం అహ్మదీపూర్‌లో సోమవారం....

Published : 30 Nov 2021 10:01 IST

ఎర్ర రమేశ్‌

గజ్వేల్‌, న్యూస్‌టుడే: ప్రేమ పెళ్లి కాదన్నారన్న ఉద్దేశంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం అహ్మదీపూర్‌లో సోమవారం చోటు చేసుకుంది. గజ్వేల్‌ సీఐ శేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఎర్ర రమేశ్‌ (21) గజ్వేల్‌లో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన వేరే కులానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని భావించగా నిరాకరించిన ఇరు కుటుంబాల సభ్యులు ఈనెల 26న గ్రామ పెద్దల సమక్షంలో సర్దిచెప్పారు. ఒకరినొకరు కలుసుకోవద్దని తీర్మానించారు. దీంతో మనోవేదన చెందిన యువకుడు అదే రోజు పొలం వద్ద పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు గజ్వేల్‌ ప్రభుత్వాస్పతికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ములుగు మండలం వంటిమామిడి సమీపంలోని ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఒక రోజు చికిత్స చేసినా ఆరోగ్యం మెరుగు పడకపోవటంతో ఈనెల 28న హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ 29న చనిపోయాడు. యువకుడి తండ్రి ఎర్ర సిద్ధయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని