Crime News: అలారం నొక్కారు.. అడ్డంగా బుక్కయ్యారు!
సికింద్రాబాద్ తిరుమలగిరిలోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో దోపిడీకి యత్నించిన ముగ్గురు నిందితులను తిరుమలగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర అమ్సుత్దాన్ అయోధ్యనగర్కు
ముత్తూట్ ఫైనాన్స్లో దోపిడీకి విఫలయత్నం
కంటోన్మెంట్, న్యూస్టుడే: సికింద్రాబాద్ తిరుమలగిరిలోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో దోపిడీకి యత్నించిన ముగ్గురు నిందితులను తిరుమలగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర అమ్సుత్దాన్ అయోధ్యనగర్కు చెందిన లక్ష్మణ్(45), ముంబయి ధారావికి చెందిన అశోక్(43), మహారాష్ట్ర కాసర్గఢ్కు చెందిన ప్రభేడ్ బాలకృష్ణన్(23)లు సోమవారం ఉదయం 9గంటల ప్రాంతంలో తిరుమలగిరి ఆర్టీసీకాలనీలోని ముత్తూట్ ఫైనాన్స్లోకి చొరబడటానికి యత్నించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ముఠా సభ్యులను ముందే గమనించిన సంస్థ సిబ్బంది వెంటనే అలారం నొక్కారు. దీంతో అప్రమత్తమైన స్థానికులు, సిబ్బంది కలిసి నిందితులను వెంబడించారు. నిందితులు ముత్తూట్ ఫైనాన్స్ నుంచి ఎల్ఐసీ బిల్డింగ్ వైపు పరుగులు తీస్తుండగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద మారణాయుధాలు కూడా లభ్యమవ్వడంతో వెంటనే తిరుమలగిరి లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ