వెయ్యికి ఆశపడి.. గంజాయితో దొరికిపోయాడు

మండలంలోని గంజాల్‌ టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం సాయంత్రం 1.3 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్‌ఐ రవీందర్‌ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్‌ జిల్లా

Updated : 04 Dec 2021 06:46 IST

టోల్‌ప్లాజా వద్ద నిందితునితో పోలీసులు, రెవెన్యూ అధికారులు

సోన్‌, న్యూస్‌టుడే: మండలంలోని గంజాల్‌ టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం సాయంత్రం 1.3 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్‌ఐ రవీందర్‌ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌కు చెందిన సునీల్‌ హోటల్‌లో పనిచేస్తాడు. ఇచ్చోడకు చెందిన రఘువీర్‌ సునీల్‌ను కలిసి సంచి పట్టుకొని తనతో వస్తే వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పడంతో ఒప్పుకొన్నాడు. ఇద్దరు కలిసి ఇచ్చోడ నుంచి నిజామాబాద్‌కు ద్విచక్ర వాహనంపై సంచితో బయలు దేరారు. టోల్‌ప్లాజా వద్దకు రాగానే పోలీసులను చూసి రఘువీర్‌ వాహనాన్ని వదిలి పారిపోయాడు. సునిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని సంచిని తనిఖీ చేయగా గంజాయి లభ్యమైనట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని