ట్యాంక్లోని మృతదేహం కిశోర్గా గుర్తింపు
తాగునీటి ట్యాంక్లోని మృతదేహం కేసు కొలిక్కి వచ్చింది. మృతుడు రాంనగర్ డివిజన్ అంబేడ్కర్నగర్కు చెందిన కిశోర్(26)గా పోలీసులు గుర్తించారు. ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ జహంగీర్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం...రాంనగర్ డివిజన్ అంబేడ్కర్నగర్కు చెందిన పుష్పలత,
రాంనగర్, న్యూస్టుడే: తాగునీటి ట్యాంక్లోని మృతదేహం కేసు కొలిక్కి వచ్చింది. మృతుడు రాంనగర్ డివిజన్ అంబేడ్కర్నగర్కు చెందిన కిశోర్(26)గా పోలీసులు గుర్తించారు. ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ జహంగీర్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం...రాంనగర్ డివిజన్ అంబేడ్కర్నగర్కు చెందిన పుష్పలత, ఈశ్వర్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు వివాహం కావడంతో కవాడిగూడలో ఉంటూ రాంగోపాల్ పోలీసు స్టేషన్లో హౌస్ కీపింగ్గా పనిచేస్తోంది. ఈశ్వర్ ఐదేళ్ల క్రితం చనిపోవడంతో పుష్పలత తన చిన్న కూతురు, ఇద్దరు కుమారులతో కలిసి అంబేడ్కర్నగర్లో అద్దె ఇంట్లో ఉంటోంది. కిశోర్ గంజాయి, మద్యానికి బానిసయ్యాడు. సెప్టెంబర్ 19న రాత్రి కిశోర్ మద్యం తాగి ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో ఇంటి నుంచి వెళ్లిన కిశోర్.. స్నేహితుడు మధును కలిసి అర్ధరాత్రి వరకు రిసాలగడ్డ జలమండలి రిజర్వాయర్ వద్ద మద్యం తాగాడు. అనంతరం కిశోర్.. స్నేహితుని చెప్పులు వేసుకుని వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు సెప్టెంబర్ 23న చిక్కడపల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు మధును అదుపులోకి తీసుకున్నారు. కిశోర్ది హత్యా.. ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
క్లోరినేషన్ ప్రక్రియే కాపాడిందా?
ఈనాడు, హైదరాబాద్: 50 రోజులుగా వాటర్ ట్యాంక్లోనే మృతదేహం ఉండటం...ఆ నీరే నాలుగు బస్తీలకు సరఫరా అవుతుండడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. దాదాపు నాలుగు కాలనీలకు చెందిన 15-20 వేల మందిపై ఈ ప్రభావం పడింది. శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్యంపై ఆరా తీశారు. బుధవారం స్థానికంగా వైద్య శిబిరాలు నిర్వహించింది. పలువురికి పరీక్షలు నిర్వహించారు. ఇద్దరు, ముగ్గురు తమకు వాంతులు అయ్యేలా ఉన్నాయని వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లడంతో పరిశీలించి మందులిచ్చారు. రిసాలగడ్డ రిజర్వాయర్ సామర్థ్యం 900 కిలోలీటర్లు. బాకారం, శివస్తాన్పూర్, రిసాలగడ్డ, ఎస్ఆర్కేనగర్ బస్తీలకు ఈ జలాన్ని రోజు విడిచి రోజు సరఫరా చేస్తుంటారు. జలమండలి మూడు విడతల్లో నీటిని క్లోరినేషన్ చేస్తుంది. తొలుత ప్రధాన రిజర్వాయర్లోకి చేరకముందే క్లోరిన్ కలుపుతుంది. అక్కడ నుంచి సర్వీసు రిజర్వాయర్లోకి వచ్చేటప్పుడు నీటిలో క్లోరిన్ కలుపుతుంది. తుదిగా ట్యాంకు నుంచి ఇళ్లకు చేరేటప్పుడు మరోసారి క్లోరినేషన్ ప్రక్రియను చేస్తుంది. దీంతో ట్యాంకులో శవం చాలా రోజులు ఉన్నా అనారోగ్య సమస్యలు తలెత్తలేదని వైద్య సిబ్బంది తెలిపారు. ఎంత క్లోరినేషన్ చేసినా.. నీటిని బాగా మరిగించి, చల్లారిన తర్వాత వడబోసి తాగడం మేలని వైద్యులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
చైనాకు చెందిన ఓ మహిళ(31) అగ్నిపర్వతం అంచున ఫొటో తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మరణించిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు
మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత నెల 22న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన సబ్రిజిస్ట్రార్ తస్లీమ మహ్మద్ ఇంట్లో అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
చదువుపై మక్కువతో నవ వధువు బలవన్మరణం
ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినా కుటుంబసభ్యులు వివాహం చేయడంతో నవ వధువు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్ గ్రామంలో చోటుచేసుకుంది. -
మహిళపై అమానుషానికి పాల్పడింది సంగారెడ్డి యువకులు!
మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. -
ఏపీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడి అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడు బోయ మహానందిని మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి
వైద్య విద్య కోసం కిర్గిజ్స్థాన్ వెళ్లిన తెలుగు విద్యార్థి అక్కడి జలపాతం సందర్శనకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. -
మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు
పట్టుమని 30 ఏళ్లు కూడా నిండలేదు.. రెండేళ్ల కిందటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ.. ఆనందంగా జీవిస్తున్న ఆ దంపతుల ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోయాయి. -
పంట నష్టాలతో రైతు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివారు మాకుల తండాలో ఇస్లావత్ చీనా(42) అనే రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో నష్టం, ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. -
రాళ్లు విసిరి.. జెండా కర్రలతో కొట్టి
తెదేపా ఎస్సీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నామినేషన్ వేశారు. -
పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి నిప్పు
పల్నాడు జిల్లాలో వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం రాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్