Crime News: స్నేహితుడి కుమార్తెపైనే సామూహిక అత్యాచారం

ఏడో తరగతి చదువుతున్న 11 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా..

Published : 15 Dec 2021 10:45 IST

జబల్‌పుర్, ఫతేపుర్‌: ఏడో తరగతి చదువుతున్న 11 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో బాలిక తండ్రి స్నేహితులే నిందితులని పోలీసులు తెలిపారు. ఈ మేరకు 25, 26 ఏళ్ల వయసున్న నిందితులు బాధితురాలిపై ఆమె ఇంటి పెరట్లోనే దారుణానికి పాల్పడ్డారని అదనపు ఎస్పీ సంజయ్‌ అగర్వాల్‌ తెలిపారు. డిసెంబరు ఏడో తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిందితులిద్దరినీ అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు.

సొంత కుమార్తెపై..
తాగిన మైకంలో ఓ తండ్రి కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ ఫతేపుర్‌లోని ఖగా కొత్వాలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘోరం జరిగింది. 9 ఏళ్ల బాధితురాలు ఆదివారం రాత్రి తన తండ్రితో పాటు నిద్రిస్తోంది. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో ఆమె ఏడుపులు విని మేల్కొన్న బాలిక పెదనాన్న జరిగిన దారుణాన్ని గమనించాడు. సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిని అరెస్టు చేసినట్లు అదనపు ఎస్పీ గయాదత్‌ మిశ్రా తెలిపారు. బాధితురాలి తల్లి కొన్నేళ్ల క్రితమే మరణించిందని వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని