Crime News: సుపారీ ఇచ్చి.. యువకుడిని హత్య చేయించిన తోటి విద్యార్థినులు

తమను తరచూ బెదిరిస్తుండటంతో కిరాయి హంతకులతో మాట్లాడి తోటి విద్యార్థినులే యువకుడిని హత్య చేయించినట్లు దర్యాప్తులో తేలింది. మంగళవారం తమిళనాడు, ఆరంబాక్కం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రెండు రోజుల క్రితం గు

Updated : 22 Dec 2021 10:10 IST

గుమ్మిడిపూండి, న్యూస్‌టుడే: తమను తరచూ బెదిరిస్తుండటంతో కిరాయి హంతకులతో మాట్లాడి తోటి విద్యార్థినులే యువకుడిని హత్య చేయించినట్లు దర్యాప్తులో తేలింది. మంగళవారం తమిళనాడు, ఆరంబాక్కం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రెండు రోజుల క్రితం గుమ్మిడిపూండి, పెద్దఓబులాపురం పరిధిలోని ఈచ్చక్కాడులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం భూమిలో పాతిపెట్టి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తహసీల్దారు మహేష్‌ సమక్షంలో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పొన్నేరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. మృతుడు చెంగల్పట్టు జిల్లా గూడువాంజేరి సమీపంలోని మన్నివాక్కానికి చెందిన ప్రేంకుమార్‌(20)గా గుర్తించారు. చెన్నై, మీనంబాక్కం కళాశాలలో చదువుతున్న ఇతను తోటి విద్యార్థినులతో అసభ్యంగా మాట్లాడే వాడని, ఇలా సంభాషించిన ఆడియోను తల్లిదండ్రులకు పంపినట్లు బెదిరించేవాడని తెలిసింది. ఇలా అతని ప్రవర్తనతో ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థినులు కిరాయి హంతకుల సాయంతో ప్రేంకుమార్‌ను హత్య చేయించినట్లు బయటపడింది. కేసు దర్యాప్తులో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని