Crime News: 8 నెలలు.. 725 పార్సిళ్లు
విశాఖపట్నం మన్యం నుంచి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లోని వివిధ ప్రాంతాలకు ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా 8 నెలల్లో 725 సార్లు గంజాయి పార్సిళ్లు వెళ్లినట్లు స్పెషల్
అమెజాన్లో విశాఖ నుంచి గంజాయి తరలింపు
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లకు వెళ్లిన సరకు
ఎస్ఈబీ దర్యాప్తులో వెలుగుచూస్తున్న కొత్త కోణాలు
ఈనాడు, అమరావతి: విశాఖపట్నం మన్యం నుంచి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లోని వివిధ ప్రాంతాలకు ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా 8 నెలల్లో 725 సార్లు గంజాయి పార్సిళ్లు వెళ్లినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) దర్యాప్తులో తేలింది. ఒక్కో పార్సిల్లో రెండేసి కిలోలు చొప్పున 1,450 కిలోలు తరలినట్లు ప్రాథమికంగా వెల్లడైంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబరు 12 మధ్య రూ.1.45 కోట్ల విలువైన గంజాయి సరఫరా చేసినట్లు దర్యాప్తులో వెలుగుచూసింది. బాబు టెక్స్ సంస్థ పేరుతో 364 సార్లు, మరో ఆరు సంస్థల పేర్లతో 361 సార్లు గంజాయి పార్సిళ్లు వెళ్లాయి. సూపర్ నేచురల్ స్టీవియా లీవ్స్ సరఫరా ముసుగులో గంజాయి స్మగ్లింగ్ సాగింది. ఇదే తరహాలో ఇంకా ఏవైనా ముఠాలు ఈ-కామర్స్ వేదికలను వినియోగించి స్మగ్లింగ్ చేస్తున్నాయా? అనే కోణంలో ఎస్ఈబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్డరు పెట్టేదీ... సరఫరా చేసేదీవారే
* ముఠా సూత్రధారులైన మధ్యప్రదేశ్కు చెందిన ముకుల్ జైస్వాల్, సూరజ్ పవయ దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వాణిజ్య సంస్థలు, దుకాణాలపై రాసి ఉండే వాటి పేర్లు, జీఎస్టీ నంబర్లు సేకరించారు. ఆ పేరు, జీఎస్టీ నంబరు ఉపయోగించి చిరునామా మార్చేసి విక్రేతలు(వెండర్స్)గా అమెజాన్లో వివరాలు నమోదు చేసుకున్నారు.
* తాము ఆయుర్వేద ఉత్పత్తులు, సూపర్ నేచురల్ స్టీవియా లీవ్స్ అమ్ముతామంటూ అందులో చూపించారు. రెండు కిలోల స్టీవియా లీవ్స్ ధర రూ.180గా పేర్కొన్నారు. నిజంగానే స్టీవియా లీవ్స్, ఆయుర్వేద ఉత్పత్తులు కావాల్సిన వారు అందులో ఆర్డరు పెడితే ‘స్టాకు లేదు (నోస్టాక్)’ అని చూపించేలా ఏర్పాటు చేసుకున్నారు.
* ముకుల్ జైస్వాల్, సూరజ్ పవయ... తాము విశాఖ నుంచి గంజాయి దిగుమతి చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం వారే అమెజాన్లో స్టీవియా లీవ్స్ కోసం ఆర్డరు పెట్టేవారు. మధ్యప్రదేశ్లోని చిరునామాకు సరఫరా చేయాలని ఆ ఆర్డరులో పొందుపరిచేవారు. దాని ఆధారంగా జనరేట్ అయ్యే ఇన్వాయిస్ను విశాఖపట్నంలోని ఆపరేటర్కు పంపించేవారు.
* ఆ ఆపరేటర్ చిన్నచిన్న బాక్సుల్లో రెండేసి కిలోల చొప్పున గంజాయి నింపి ప్యాక్ చేసి.. వాటిపై ఆ ఇన్వాయిస్ అతికించి అమెజాన్ పికప్ బాయ్లకు అందించేవారు. అది అక్కడి నుంచి హైదరాబాద్కు చేరి మధ్యప్రదేశ్కు తరలిపోయేది.
* అధికారికంగా చూస్తే స్టీవియా లీవ్స్ కోసమే ఆర్డరు వచ్చినట్లు, అవే సరఫరా అవుతున్నట్లు ఉండేది. కానీ ఆ పార్సిళ్లలో స్టీవియా లీవ్స్కు బదులు గంజాయి ఉండేది.
* ఈ ప్రక్రియ మొత్తాన్ని పర్యవేక్షించేందుకు ముకుల్ జైస్వాల్, సూరజ్ పవయ నెలకోసారి విమానంలో మధ్యప్రదేశ్ నుంచి విశాఖపట్నం వచ్చేవారు.
దొరకని స్మగ్లర్లు 648 మంది
ఈనాడు, అమరావతి: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని విశాఖ మన్యం కేంద్రంగా సాగవుతున్న గంజాయి స్మగ్లింగ్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న దాదాపు 648 మంది స్మగ్లర్లు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. వీరిలో ఎక్కువ మంది తెలంగాణ, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల వారే. కొన్నేళ్ల కిందట వరకూ విశాఖ మన్యంలో వందల ఎకరాల్లోనే గంజాయి సాగయ్యేది. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ముఠాలు వచ్చి పెట్టుబడి పెట్టి సాగు చేయించటం మొదలుపెట్టాక గత పదేళ్లలో అది విస్తృతమైంది. విశాఖ మన్యం నుంచి దేశ, విదేశాలకు తరలింపు ఎక్కువైంది.
ఈ పదేళ్లలో పోలీసులు నమోదుచేసిన కేసుల్లో 16 రాష్ట్రాలకు చెందిన 5,254 మంది స్మగ్లర్లు నిందితులుగా తేలారు. గత కొన్నాళ్లుగా వీరిలో 4,606 మందిని ఇప్పటివరకూ అరెస్టుచేశారు. ఇతర రాష్ట్రాల స్మగ్లర్లలో పట్టుబడకుండా తప్పించుకు తిరుగుతున్న వారు 648 మంది వరకూ ఉన్నారని ఎస్ఈబీ గుర్తించింది. విశాఖపట్నంలో ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల పోలీసు, ఇతర శాఖల ఉన్నతాధికారుల ప్రాంతీయ సదస్సులో... ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులకు పట్టుకోవాల్సిన స్మగ్లర్ల జాబితాను ఏపీ పోలీసు, ఎస్ఈబీ అధికారులు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ