Crime News: తెదేపా దళిత కార్యకర్తపై దుండగుల దుశ్చర్య
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రుకు చెందిన దళిత యువకుడు, తెదేపా కార్యకర్త వెంకట నారాయణపై మద్యం మత్తులో కొందరు దుండగులు
మద్యం మత్తులో దాడి చేసి హత్యకు యత్నం
బీరు సీసాలతో తల పగులగొట్టి నిప్పంటించి పరారు
గుంటూరు జిల్లా బోయపాలెంవద్ద ఘటన
ఈనాడు, అమరావతి - న్యూస్టుడే, యడ్లపాడు: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రుకు చెందిన దళిత యువకుడు, తెదేపా కార్యకర్త వెంకట నారాయణపై మద్యం మత్తులో కొందరు దుండగులు దాడి చేసి హత్యకు యత్నించారు. బీరు సీసాలతో తల పగులగొట్టి నిప్పంటించి పరారయ్యారు. తీవ్ర గాయాలైన బాధితుడు ప్రస్తుతం గుంటూరు బోధనాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. యడ్లపాడు, ప్రత్తిపాడు మండలాల సరిహద్దులో బోయపాలేనికి సమీపంలోని పొలాల్లో ఈ ఘటన సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జరగగా.. మంగళవారం ఉదయం వెలుగు చూసింది. వంట మాస్టరుగా జీవనం సాగిస్తున్న వెంకట నారాయణ తన అత్తగారి ఊరైన పెదకూరపాడులో ఉంటున్నారు. కొప్పర్రులో ఉంటున్న తల్లిని చూడటానికి సోమవారం రాత్రి బయలుదేరారు. మార్గమధ్యంలో ఉన్నవ రోడ్డులోని మద్యం దుకాణానికి సమీపంలోని పొలాల్లోకి వెళ్లి మద్యం తాగుతున్నారు. అప్పటికే అక్కడ మరికొందరు మద్యం సేవిస్తున్నారు. వీరి మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. చివరకు అది అతనిపై దాడి చేసే వరకు వెళ్లింది. తెదేపా ప్రభుత్వ హయాంలో మద్యం ధరలు ఇంతగా లేవని, ప్రస్తుతం చేసిన చాకిరంతా దీనికే సరిపోతుందని బాధితుడు అనగా ప్రత్యర్థులు ఒక్కసారిగా అతనిపై బీరు సీసాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం పత్తి చేలో పడేసి వెళ్లిపోయారు. 40శాతానికి పైగా కాలిన గాయాలైన బాధితుడు వెంకట నారాయణ సోమవారం రాత్రి నుంచి ఘటన ప్రదేశంలోనే ఉన్నారు. మంగళవారం ఉదయం సమీపంలో ఉన్న నూలు మిల్లు వద్దకు వెళ్లారు. అక్కడి వాచ్మన్ చూసి 108కు సమాచారమివ్వగా వారు వచ్చి జీజీహెచ్లో చేర్పించారు.
తీవ్రంగా ఖండిస్తున్నా: లోకేశ్
దళితుడైన వెంకట నారాయణను మద్యం సీసాలతో కొట్టి నిప్పంటించిన రాక్షస మూకల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ పేర్కొన్నారు. ‘తప్పును తప్పని చెబితే చంపేస్తారా? మనుషుల ప్రాణాలే తీసేస్తారా?’ అని ఆయన ప్రశ్నించారు.
రాజకీయ ప్రమేయం లేదు: డీఎస్పీ
నరసరావుపేట పట్టణం, గోరంట్ల (గుంటూరు)- న్యూస్టుడే: వెంకట నారాయణపై జరిగిన దాడిలో ఎలాంటి రాజకీయ కోణం లేదని డీఎస్పీ విజయభాస్కరరావు తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. మద్యం తాగి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారని వెంకటనారాయణ ఫిర్యాదు ఇచ్చిన వెంటనే యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ‘సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టగా అతనికి సంబంధించిన పలు దొంగతనాలు వెలుగుచూశాయి. గతంలో ట్రాన్స్ఫార్మర్లలో తీగలు చోరీ చేసేవాడని విచారణలో తేలింది. నల్లపాడు, చిలకలూరిపేట, ప్రకాశం జిల్లాలోని జె.పంగులూరు, మార్టూరు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వెంకట నారాయణపై ఎవరూ దాడి చేయలేదని తీగలు దొంగిలించే క్రమంలో షాక్తగిలి గాయాలయ్యాయని విచారణలో తేలింది...’ అని వివరించారు.
* అంతకుముందు సాయంత్రం హోం మంత్రి మేకతోటి సుచరిత విలేకరులతో మాట్లాడారు. వెంకట నారాయణపై జరిగిన దాడి ఘటనపై కనీస అవగాహన లేకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారని వివరించారు.
బాధితుడు వెంకట నారాయణ ఏమన్నారంటే..
‘ఉన్నవ రోడ్డులోని దుకాణంలో మద్యం కొనుగోలు చేసి తాగడానికి సమీపంలోని స్థిరాస్తి వెంచర్లోకి వెళ్లా. అక్కడ గుర్తు తెలియని ఐదారుగురు దుర్భాషలాడుతూ నాపై దాడి చేశారు. మందు సీసాతో నా తలపై కొట్టి గాయపరిచారు. ఒళ్లంతా గాయాలైన నన్ను పత్తి చేలో పడేశారు. నేను స్పృహ కోల్పోయా. తర్వాత ఏం జరిగిందో తెలియదు. దాహం వేస్తుంటే మంచినీటి కోసం సమీపంలోని నూలు మిల్లులోకి వెళ్లా...’ అని వెంకటనారాయణ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Nalgonda: ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి.. పెళ్లి చూపుల్లో బయటపడిన యువతి మోసం
ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి అవుతున్న ఓ యువతిని నల్గొండ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. -
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
బెంగళూరులో పేలుడు పదార్థాలు వెలుగు చూసిన ఘటన కలకలం రేపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
Hyd News: నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
శంషాబాద్ పరిధిలో నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. -
వైకాపా మూకల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్త మృతి
వైకాపా మూకల దాడిలో తీవ్రంగా గాయపడిన తెదేపా కార్యకర్త మునయ్య మృతిచెందారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పరమేశ్వరనగర్లో సోమవారం ఆయనపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. -
వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య
వంట చేయడంలో ఆలస్యం అయిందని ఓ వ్యక్తి భార్యను పదునైన ఆయుధంతో చంపేశాడు. అనంతరం భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
అధిక వడ్డీల ఆశజూపి.. భారీ మోసం!
తమ సంస్థలో పెట్టుబడులు పెడితే.. అధిక వడ్డీతో పాటు తక్కువ సమయంలోనే భారీగా ఆర్జించవచ్చని మాయమాటలతో నమ్మించిన దంపతులు బోర్డు తిప్పేసిన ఘటన హైదరాబాద్ ఉప్పల్లో చోటుచేసుకుంది. -
కోల్కతాలో కుప్పకూలిన అయిదంతస్తుల భవనం.. తొమ్మిది మంది మృతి
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మాణంలో ఉన్న ఓ అయిదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
హార్డ్డిస్కులను అడవిలో పడేసిన ప్రణీత్రావు!
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్సైబీ)లోని హార్డ్డిస్కులను కట్టర్లతో కత్తిరించి, వికారాబాద్ అడవిలో పడేసినట్లు రెండోరోజు విచారణలో డీఎస్పీ ప్రణీత్రావు ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. -
పెళ్లి కారు, ట్రాక్టర్ ఢీ.. బిహార్లో 9 మంది మృతి
బిహార్లోని ఖగారియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, పెళ్లి కారు ఢీ కొన్న ఘటనలో 9 మంది మరణించారు. -
నకిలీ ఔషధ రాకెట్ కేసులో ఈడీ దాడులు
దేశ రాజధాని దిల్లీలో బయటపడిన నకిలీ ఔషధ రాకెట్ గుట్టును ఛేదించే క్రమంలో ఈడీ దాదాపు 10 ప్రదేశాల్లో దాడులు చేసింది. ముఠా ప్రధాన సూత్రధారులు విపిల్ జైన్, నీరజ్ చౌహన్, సూరజ్ షాత్, అభినవ్, తుషార్ చౌహాన్లతో సహా వారి సహచరుల ఇళ్లల్లోను ఈడీ దాడులు చేసింది. -
రూ.5.73 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఈదులగూడ వద్ద సోమవారం పట్టణం నుంచి కోదాడ వైపు వెళ్తున్న టీఎస్ 09 యూఈ 2479 నంబరు గల బొలేరో వాహనంలో రూ.5.73 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చందనా దీప్తి పేర్కొన్నారు. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వద్ద చోరీ.. ఆపై అడ్డంగా దొరికారు
ఓ వ్యక్తి మెడలో ఉన్న గొలుసును చోరీ చేసిన ఇద్దరు దొంగలు చివరకు పోలీసుల చేతికి చిక్కి, కటకటాల పాలయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
IPL: ఐపీఎల్ 2024 సీజన్. కోహ్లీ కొత్త హెయిర్స్టైల్ అదుర్స్.. ఫొటోలు వైరల్
-
Nalgonda: ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి.. పెళ్లి చూపుల్లో బయటపడిన యువతి మోసం
-
NDA: ఎన్డీఏ ‘మహా’ వ్యూహం.. ఉద్ధవ్కు చెక్ పెట్టేందుకు రంగంలోకి రాజ్..!
-
Stock market: భారీ నష్టాల్లో సూచీలు.. సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్
-
India- China: ఎన్నిసార్లు వాదించినా వాస్తవాలు మారవు.. చైనాకు భారత్ కౌంటర్
-
CAA: సీఏఏపై స్టే కోరుతూ పిటిషన్లు.. కేంద్రానికి మూడు వారాల గడువిచ్చిన సుప్రీం