Crime News: భారత క్రికెట్ జట్టులో చోటు కల్పిస్తామని టోకరా
‘మేం.. మానవ హక్కుల కమిటీ ప్రతినిధులం.. భారత క్రికెట్ జట్టులో అవకాశం కల్పిస్తాం’ అని చెప్పి ఓ యువ క్రికెటర్ నుంచి నగదు కాజేశారు..
హైదరాబాద్: ‘మేం.. మానవ హక్కుల కమిటీ ప్రతినిధులం.. భారత క్రికెట్ జట్టులో అవకాశం కల్పిస్తాం’ అని చెప్పి ఓ యువ క్రికెటర్ నుంచి నగదు కాజేశారు సైబర్ కేటుగాళ్లు. బాధితురాలు హైదరాబాద్ సైబర్ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్ కథనంప్రకారం.. టోలిచౌకికి చెందిన యువతి, ఆమె సోదరుడు క్రికెటర్లు. సెప్ట్టెంబరు 29న గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి.. ‘మీరు, మీ సోదరుడు క్రికెటర్లని తెలిసింది, మీలాంటి ప్రతిభావంతులే భారత జట్టుకు అవసరం, అవకాశం కల్పిస్తాం’ అని చెప్పారు. బాధితురాలు నమ్మారు. అవతలి వ్యక్తి కోరినట్లుగా రూ.1.25లక్షలు బదిలీచేశారు. అవతలి వ్యక్తి రెండున్నర నెలలుగా వీరిని బుకాయిస్తూ వచ్చారు. గట్టిగా నిలదీయగా.. క్రికెట్ కమిటీవారు మరికొంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పాడు. మోసాన్ని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయంచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.