విడాకులు తీసుకున్న మహిళలతో పెళ్లిళ్లు.. భర్తపై ఆరో భార్య ఫిర్యాదు

విడాకులు తీసుకున్న మహిళలను ఎంచుకుని వారిని మళ్లీ పెళ్లి చేసుకుంటున్న తన భర్త సయ్యద్‌ అహ్మద్‌పై (32) చర్యలు తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్‌ కమల్‌పంత్‌కు ...

Updated : 23 Dec 2021 09:29 IST

బెంగళూరు (మల్లేశ్వరం): విడాకులు తీసుకున్న మహిళలను ఎంచుకుని వారిని మళ్లీ పెళ్లి చేసుకుంటున్న తన భర్త సయ్యద్‌ అహ్మద్‌పై (32) చర్యలు తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్‌ కమల్‌పంత్‌కు ఓ మహిళ ఫిర్యాదు చేశారు. సయ్యద్‌ను వివాహం చేసుకున్న అనంతరం అతనికి తాను ఆరో భార్యనని తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మ్యాట్రిమోనీల్లో ప్రకటనలు ఇస్తున్న మహిళలనే గుర్తించి, వివాహం చేసుకుంటున్న తన భర్తపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. దూరవాణి నగరకు చెందిన సయ్యద్‌ తనను 2018 నవంబరు 15న వివాహం చేసుకున్నాడని, ఇప్పుడు మరో వివాహానికి ప్రయత్నిస్తున్నాడని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని