AP News: వివాహేతర సంబంధం.. వదిన, మరిది ఆత్మహత్య

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పవర్‌పేట రైల్వేస్టేషన్‌ వద్ద ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ..

Published : 06 Jan 2022 01:30 IST

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పవర్‌పేట రైల్వేస్టేషన్‌ వద్ద ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఓ వివాహిత, యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను ఏలూరుకు చెందిన అరుణకుమారి, రాజహేంద్రవరానికి చెందిన వినయ్‌గా పోలీసులు గుర్తించారు. వరుసకు వీళ్లిద్దరూ వదిన, మరిది అని దర్యాప్తులో తేలింది. ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి పంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు