Crime news: కరీంనగర్ జిల్లాలో ప్రియురాలిపై అత్యాచారం చేసి..హతమార్చిన ప్రియుడు
ప్రేమించిన యువతిని ప్రియుడే అత్యాచారం చేసి హత్య చేసిన దారుణ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది.
కరీంనగర్: ప్రేమించిన యువతిని ప్రియుడే అత్యాచారం చేసి హత్య చేసిన దారుణ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాకు చెందిన యువతి.. పోరండ్లకు చెందిన అఖిల్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో.. పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. యువతి, యువకుడు ఒకరికొకరు దూరంగా ఉండాలని పెద్దలు తీర్పునిచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 2న అమ్మాయి కనిపించకుండా పోయింది. అఖిల్పై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే అత్యాచారం చేసి హత్య చేసినట్లు అంగీకరించాడు. చెంజర్ల శివారులో యువతిని చంపిన చోటుకు పోలీసులను తీసుకెళ్లాడు. పూర్తిగా కుళ్లిపోయి, దారుణ స్థితిలో ఉన్న కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు.
► Read latest Crime News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె