AP News: ఆలుమగలు.. అప్పు కోసం అన్నాచెల్లెళ్లుగా మారి..
ఆధార్ కార్డుల్లో అడ్రస్సులు మార్చి బ్యాంకు అధికారులను మోసం చేసి రూ.9లక్షల రుణం తీసుకున్న కేసును గ్రామీణ పోలీసులు చేధించారు. గ్రామీణ స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఎస్సై భక్తవత్సలరెడ్డి వెల్లడించారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం
నరసరావుపేట లీగల్, న్యూస్టుడే: ఆధార్ కార్డుల్లో అడ్రస్సులు మార్చి బ్యాంకు అధికారులను మోసం చేసి రూ.9లక్షల రుణం తీసుకున్న కేసును గ్రామీణ పోలీసులు చేధించారు. గ్రామీణ స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఎస్సై భక్తవత్సలరెడ్డి వెల్లడించారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరుకు చెందిన దొండపాటి పవన్, ప్రభావతి దంపతులు. సంతమాగులూరు మండలం కొప్పరంలో భూముల విషయం తెలిసి పవన్ తన పేరును పల్లా వెంకటేశ్వర్లుగా మార్చుకున్నాడు. అనంతరం ప్రభావతితో కలిసి నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వచ్చి అన్నా చెల్లెళ్లుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొప్పరంలో రెండు సర్వే నంబర్లలో 4.73 ఎకరాలు, 4.62 ఎకరాలు తమ పూర్వీకుల నుంచి సంక్రమించినట్లుగా సంతమాగులూరు తహశీల్దార్ కార్యాలయంలో పట్టాదారు పాసుపుస్తకాలు పొందారు.
ఈ ప్రక్రియలో కర్రావుల మునయ్య, గుర్రం చిన్న మల్లికార్జునరావు వీరికి సాయం చేశారు. తర్వాత నరసరావుపేట మండలం ఉప్పలపాడులోని చైతన్య గోదావరి బ్యాంకులో 2020లో ఒక్కొక్కరు రూ.4.50లక్షల చొప్పున మొత్తం రూ.9లక్షల రుణం పొందారు. వీరు కిస్తీలు కట్టకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు సిబ్బంది పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి మోసానికి గురైనట్లు తెలుసుకున్నారు. గత ఏడాది నవంబర్లో బ్యాంకు మేనేజర్ పల్లెపోగు అంకిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పవన్, ప్రభావతిలకు మునయ్య, మల్లికార్జునరావుతో పాటు సరిమళ్ల జ్యోతిబాబు, సంతమాగులూరు తహశీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ కిషోర్బాబు సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. కేసులో నిందితులైన పవన్, ప్రభావతి, మునయ్యలను అరెస్టు చేసి వారి నుంచి రూ.9 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్సైలు బాలనాగిరెడ్డి, శ్రీహరి, సిబ్బంది ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్