AP News: ఆలుమగలు.. అప్పు కోసం అన్నాచెల్లెళ్లుగా మారి..
ఆధార్ కార్డుల్లో అడ్రస్సులు మార్చి బ్యాంకు అధికారులను మోసం చేసి రూ.9లక్షల రుణం తీసుకున్న కేసును గ్రామీణ పోలీసులు చేధించారు. గ్రామీణ స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఎస్సై భక్తవత్సలరెడ్డి వెల్లడించారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం
నరసరావుపేట లీగల్, న్యూస్టుడే: ఆధార్ కార్డుల్లో అడ్రస్సులు మార్చి బ్యాంకు అధికారులను మోసం చేసి రూ.9లక్షల రుణం తీసుకున్న కేసును గ్రామీణ పోలీసులు చేధించారు. గ్రామీణ స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఎస్సై భక్తవత్సలరెడ్డి వెల్లడించారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరుకు చెందిన దొండపాటి పవన్, ప్రభావతి దంపతులు. సంతమాగులూరు మండలం కొప్పరంలో భూముల విషయం తెలిసి పవన్ తన పేరును పల్లా వెంకటేశ్వర్లుగా మార్చుకున్నాడు. అనంతరం ప్రభావతితో కలిసి నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వచ్చి అన్నా చెల్లెళ్లుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొప్పరంలో రెండు సర్వే నంబర్లలో 4.73 ఎకరాలు, 4.62 ఎకరాలు తమ పూర్వీకుల నుంచి సంక్రమించినట్లుగా సంతమాగులూరు తహశీల్దార్ కార్యాలయంలో పట్టాదారు పాసుపుస్తకాలు పొందారు.
ఈ ప్రక్రియలో కర్రావుల మునయ్య, గుర్రం చిన్న మల్లికార్జునరావు వీరికి సాయం చేశారు. తర్వాత నరసరావుపేట మండలం ఉప్పలపాడులోని చైతన్య గోదావరి బ్యాంకులో 2020లో ఒక్కొక్కరు రూ.4.50లక్షల చొప్పున మొత్తం రూ.9లక్షల రుణం పొందారు. వీరు కిస్తీలు కట్టకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు సిబ్బంది పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి మోసానికి గురైనట్లు తెలుసుకున్నారు. గత ఏడాది నవంబర్లో బ్యాంకు మేనేజర్ పల్లెపోగు అంకిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పవన్, ప్రభావతిలకు మునయ్య, మల్లికార్జునరావుతో పాటు సరిమళ్ల జ్యోతిబాబు, సంతమాగులూరు తహశీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ కిషోర్బాబు సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. కేసులో నిందితులైన పవన్, ప్రభావతి, మునయ్యలను అరెస్టు చేసి వారి నుంచి రూ.9 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్సైలు బాలనాగిరెడ్డి, శ్రీహరి, సిబ్బంది ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Hyderabad: ప్రణీత్రావుకు సహకరించింది ఎవరు?
ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. -
Nalgonda: ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి.. పెళ్లి చూపుల్లో బయటపడిన యువతి మోసం
ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి అవుతున్న ఓ యువతిని నల్గొండ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. -
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
బెంగళూరులో పేలుడు పదార్థాలు వెలుగు చూసిన ఘటన కలకలం రేపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
Hyd News: నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
శంషాబాద్ పరిధిలో నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. -
వైకాపా మూకల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్త మృతి
వైకాపా మూకల దాడిలో తీవ్రంగా గాయపడిన తెదేపా కార్యకర్త మునయ్య మృతిచెందారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పరమేశ్వరనగర్లో సోమవారం ఆయనపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. -
వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య
వంట చేయడంలో ఆలస్యం అయిందని ఓ వ్యక్తి భార్యను పదునైన ఆయుధంతో చంపేశాడు. అనంతరం భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
అధిక వడ్డీల ఆశజూపి.. భారీ మోసం!
తమ సంస్థలో పెట్టుబడులు పెడితే.. అధిక వడ్డీతో పాటు తక్కువ సమయంలోనే భారీగా ఆర్జించవచ్చని మాయమాటలతో నమ్మించిన దంపతులు బోర్డు తిప్పేసిన ఘటన హైదరాబాద్ ఉప్పల్లో చోటుచేసుకుంది. -
కోల్కతాలో కుప్పకూలిన అయిదంతస్తుల భవనం.. తొమ్మిది మంది మృతి
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మాణంలో ఉన్న ఓ అయిదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
హార్డ్డిస్కులను అడవిలో పడేసిన ప్రణీత్రావు!
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్సైబీ)లోని హార్డ్డిస్కులను కట్టర్లతో కత్తిరించి, వికారాబాద్ అడవిలో పడేసినట్లు రెండోరోజు విచారణలో డీఎస్పీ ప్రణీత్రావు ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. -
పెళ్లి కారు, ట్రాక్టర్ ఢీ.. బిహార్లో 9 మంది మృతి
బిహార్లోని ఖగారియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, పెళ్లి కారు ఢీ కొన్న ఘటనలో 9 మంది మరణించారు. -
నకిలీ ఔషధ రాకెట్ కేసులో ఈడీ దాడులు
దేశ రాజధాని దిల్లీలో బయటపడిన నకిలీ ఔషధ రాకెట్ గుట్టును ఛేదించే క్రమంలో ఈడీ దాదాపు 10 ప్రదేశాల్లో దాడులు చేసింది. ముఠా ప్రధాన సూత్రధారులు విపిల్ జైన్, నీరజ్ చౌహన్, సూరజ్ షాత్, అభినవ్, తుషార్ చౌహాన్లతో సహా వారి సహచరుల ఇళ్లల్లోను ఈడీ దాడులు చేసింది. -
రూ.5.73 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఈదులగూడ వద్ద సోమవారం పట్టణం నుంచి కోదాడ వైపు వెళ్తున్న టీఎస్ 09 యూఈ 2479 నంబరు గల బొలేరో వాహనంలో రూ.5.73 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చందనా దీప్తి పేర్కొన్నారు. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వద్ద చోరీ.. ఆపై అడ్డంగా దొరికారు
ఓ వ్యక్తి మెడలో ఉన్న గొలుసును చోరీ చేసిన ఇద్దరు దొంగలు చివరకు పోలీసుల చేతికి చిక్కి, కటకటాల పాలయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
Israel Hamas Conflict: యుద్ధ తంత్రంగా ఆకలి మంటలు: ఐరాస ఆందోళన
-
Meta: ఎన్నికల్లో ఏఐ నకిలీ సమాచార కట్టడి.. మెటా ప్రత్యేక చర్యలు
-
YSRCP: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. వైకాపా ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు
-
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సరికొత్త రికార్డు.. ఆ విషయంలో తొలి మలయాళ సినిమా
-
Suryakumar Yadav: ఐపీఎల్ మ్యాచ్లకు సూర్య దూరమేనా? ఇన్స్టా పోస్ట్ వైరల్
-
LS polls: డిపాజిట్ దక్కకున్నా పోటీకి సై.. 71 వేల మంది డిపాజిట్లు ‘గల్లంతు’