Crime News: ఇన్నోవాలో వచ్చి పోలీసులమంటూ బెదిరిస్తారు.. గొర్రెలన్నీ ఎత్తుకెళ్తారు!
తెల్లవారుజామున ఇన్నోవాలో తిరుగుతూ జాతీయ రహదారిపై కాపు కాస్తారు. గొర్రెలను తీసుకొని మార్కెట్లో అమ్మడానికి వెళ్తున్న వాహనాలనే లక్ష్యంగా..
సంగారెడ్డి: తెల్లవారుజామున ఇన్నోవాలో తిరుగుతూ జాతీయ రహదారిపై కాపు కాస్తారు. గొర్రెలను తీసుకొని మార్కెట్లో అమ్మడానికి వెళ్తున్న వాహనాలనే లక్ష్యంగా చేసుకుంటారు. వాహనాన్ని అడ్డుకుని, గొర్రెలను ఎక్కడకు తీసుకెళ్తున్నారు? అన్ని రకాల పత్రాలున్నాయా? అంటూ హడావుడి చేస్తారు. వాహనంలోని వారిని ఇన్నోవాలో ఎక్కించుకొని బెదిరించి ఉన్నదంతా దోచుకొని రోడ్డుపై విడిచిపెడతారు. ఈలోగా మిగతా ముఠా సభ్యులు గొర్రెలను వేరే వాహనంలో తరలించి అమ్మేస్తారు. ఇదీ 52 కేసులున్న ఖాజా వహబుద్దీన్ ముఠా నేరాలు చేసే తీరు. ముఠా గుట్టు లాగిన తీరుపై సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. చాంద్రాయణగుట్టకు చెందిన ఖాజా వహబుద్దీన్ (45) ఆరుగురితో ముఠాను ఏర్పాటు చేశాడు. మధ్యప్రదేశ్ నుంచి పిస్టోల్, బుల్లెట్లను కొనుగోలు చేశాడు. గత నెల 8న మహారాష్ట్రకు చెందిన మహదేవ్ బీరూ గోడ్కే తన బొలెరోలో గొర్రెలను జియాగూడ మార్కెట్కు తీసుకెళ్తున్నారు. తెల్లవారుజామున ఇన్నోవాలో వచ్చిన వహబుద్దీన్ ముఠా సభ్యులు వాహనాన్ని ఆపి బెదిరించి గొర్రెలను ఎత్తుకెళ్లిపోయారు. ఈ నెల 13న మహారాష్ట్రకు చెందిన షేక్ తస్లీం దేశ్ముఖ్ తన డ్రైవర్ కిషన్ భజరంగ్, మరో వ్యక్తి హనుమాన్తో కలిసి గొర్రెలను జియాగూడ మార్కెట్కు తరలిస్తున్నారు. పటాన్చెరు మండలం రుద్రారంవద్ద ఇన్నోవాలో వచ్చి బాధితుల వద్ద రూ.7వేలు, సెల్ఫోన్లు లాక్కొన్నారు. వీటిపై పోలీసులు దృష్టి సారించి... ఖాజా వహబుద్దీన్తోపాటు అతడికి సహకరించిన మహ్మద్ తాజుద్దీన్ (27), మహ్మద్ ఇసాక్ (33), మహ్మద్ అనీఫ్ (35)లను అరెస్టు చేశారు. వీరి నుంచి ఒక పిస్టోలు, రెండు కత్తులు, ఏడు బుల్లెట్లు, రూ.1.51లక్షల నగదు, రూ.3.20లక్షల విలువ చేసే 60 గొర్రెలను స్వాధీనం చేసుకున్నారు. ఖాజా వహబుద్దీన్పై ఇప్పటికే 52 కేసులు నమోదయ్యాయి. ముఠాకు సహకరించిన తైమూరు, అమీర్, షేక్ ఇమ్రాన్లు పరారీలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి