ద్విచక్రవాహనం కోసం చంపేశారు!
జైనథ్ మండలం తరుణం గ్రామ సమీపంలో జరిగిన వ్యక్తి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాన్ని దొంగలించడానికి ఏకంగా వ్యక్తినే హత్య చేసినట్లు శనివారం....
మిస్టరీని ఛేదించిన జైనథ్, సీసీఎస్ పోలీసులు
కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, పక్కన డీఎస్పీ వెంకటేశ్వర్రావు, చిత్రంలో నిందితులు
ఆదిలాబాద్ గ్రామీణం, న్యూస్టుడే : జైనథ్ మండలం తరుణం గ్రామ సమీపంలో జరిగిన వ్యక్తి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాన్ని దొంగలించడానికి ఏకంగా వ్యక్తినే హత్య చేసినట్లు శనివారం గ్రామీణ పోలీస్స్టేషన్లో ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 4న జైనథ్ మండలం తరుణం గ్రామం సమీపంలో జైనథ్, చంద్రపూర్ రహదారి పక్కన జైనథ్ పోలీసులకు ఓ గుర్తు తెలియని మృతదేహం లభించింది. శవం కనపడకుండా ముళ్లకంప ఉంచడం.. గొంతుపై కత్తితో గాయాలు ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆ మృతదేహం పట్టణంలోని పుత్లిబౌలికి చెందిన ఇందూర్ గజానంద్(36)గా గుర్తించారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 15 రోజుల్లో మిస్టరీని ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. డీఎస్పీ వేంకటేశ్వరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు కేసు విచారణను వేగంగా దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాలు, స్థానికంగా లభించిన సాక్ష్యాధారాలతో బంగారుగూడకు చెందిన 22 ఏళ్ల షేక్ అస్లాం, 20 ఏళ్ల ఎటుకోక విజయ్ హత్య చేసినట్లు గుర్తించారన్నారు.
ఈ నెల 1న గజానంద్ ఎన్టీఆర్ చౌక్లో తన ద్విచక్ర వాహనాన్ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు నిందితులు తెలుసుకున్నారు. తాకట్టు పెట్టి డబ్బులు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పారు. ఆ రోజంతా చీకటి పడే వరకు పట్టణంలోని పలు కూడళ్లలో తిప్పారు. ఆ తరువాత జైనథ్ రహదారిలో గజానంద్ను హత్య చేశారు. నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు శుక్రవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పట్టుకొని అరెస్టు చేశారు. ద్విచక్ర వాహనం దొంగలించడానికే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు ఎస్పీ వివరించారు. కేసును ఛేదించిన డీఎస్పీ వేంకటేశ్వరావు, జైనథ్ సీఐ కొంక మల్లేష్, సీసీఎస్ సీఐ చంద్రమౌళి, బృందం సభ్యులను ఎస్పీ అభినందించారు. వారికి పురస్కారం అందించనున్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు