డబ్బుల కోసమే కాల్పులు
సర్పంచిపై హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. డబ్బుల కోసమే నేరానికి పాల్పడ్డారని ఎస్పీ అమిత్బర్దార్ స్పష్టం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం విలేకరులకు ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. గార మండలం
సర్పంచిపై హత్యాయత్నం కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ
వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ అమిత్బర్దార్
శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్టుడే: సర్పంచిపై హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. డబ్బుల కోసమే నేరానికి పాల్పడ్డారని ఎస్పీ అమిత్బర్దార్ స్పష్టం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం విలేకరులకు ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. గార మండలం రామచంద్రపురం గ్రామ సర్పంచి గొలివి వెంకటరమణమూర్తి కాంట్రాక్టర్గా చేస్తున్నారు. శ్రీకాకుళం నగరం మధురానగర్ కాలనీలోని సొంత కార్యాలయంలోనే ఈ నెల 18న ఆయనపై హత్యాయత్నం జరిగింది. కేసులో ప్రధాన సూత్రధారి, ఉత్తర్ప్రదేశ్కు చెందిన షాలినీ సూచన ప్రకారం ఆమె తమ్ముడు గిరి, అతని స్నేహితుడు మధ్యప్రదేశ్ వాసి మోహిత్ పిస్టల్తో కాల్పులు జరిపారు. షాలినీ కొంతకాలం కిందట శ్రీకాకుళానికి చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకొని ఇక్కడే ఉంటోంది. మూర్తితో అయిదేళ్లుగా ఆమెకు పరిచయం ఉంది. దాంతో ఆమె రూ.10 లక్షలివ్వాలని డిమాండ్ చేసింది. ఆయన నిరాకరించడంతో రూ.2 లక్షలైనా ఇవ్వాలంది. అంగీకరించకపోవడంతో హత్యకు పథకం వేసినట్టు ఎస్పీ వివరించారు. ఘటనలో మూర్తి చిన్న గాయాలతో బయటపడిన విషయం తెలిసిందే.
స్వాధీనం చేసుకున్న పిస్టల్, బుల్లెట్లు
3 రోజులు.. 4 బృందాలు..
ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వివరించారు. దేశీయంగా తయారైన పిస్టల్తో పాటు, 8 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనికి లైసెన్స్ కూడా లేదన్నారు. క్రైం అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, శ్రీకాకుళం డీఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో కేసును మూడు రోజుల్లోనే ఛేదించామన్నారు. నాలుగు బృందాలుగా ఒకటో పట్టణ సీఐ అంబేడ్కర్ షాలినీని, రెండోపట్టణ సీఐ ఈశ్వరప్రసాద్ తన బృందంతో కలిసి గిరి, మోహిత్లను పట్టుకున్నారని వివరించారు. వారిని ఎస్పీఅభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
-
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268