హతమార్చి.. వాగులో పడేశారు..
నిర్మల్- మంచిర్యాల ప్రధాన మార్గంలో లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్ వద్ద వాగులో ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వ్యక్తిని హతమార్చి వాగులో పడేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు.
గుర్తు తెలియని వ్యక్తి హత్య
మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ ఉపేందర్రెడ్డి, సీఐ, ఎస్సైలు (అంతరచిత్రంలో గుర్తు తెలియని వ్యక్తి)
కనకాపూర్(లక్ష్మణచాంద), న్యూస్టుడే: నిర్మల్- మంచిర్యాల ప్రధాన మార్గంలో లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్ వద్ద వాగులో ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వ్యక్తిని హతమార్చి వాగులో పడేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సోన్ సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై రాహుల్గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కనకాపూర్ వాగులో ఉదయం అటుగా వెళ్లిన వారికి నీటిలో తేలియాడుతున్న వ్యక్తి కనిపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేయటంతో వారు వచ్చి పరిశీలించారు. రహదారిపైన, వంతెన పైన రక్తపు మరకలు కనిపించాయి. వాహనంలో వచ్చి మృతదేహాన్ని పడేసినట్లుగా ఆనవాళ్లు కనిపించాయి. సదరు వ్యక్తికి 45 సంవత్సరాల్లోపు వయస్సు ఉంటుందని, ఒంటిమీద బనియన్, లుంగీ మాత్రమే ఉన్నాయని తెలిపారు. తలపై గాయాలను గుర్తించారు. డీఎస్పీ ఉపేందర్రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సాయంత్రం వరకు వ్యక్తి ఆచూకీ లభించలేదు. నిర్మల్ మార్చురీలో మృతదేహాన్ని ఉంచామని, వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు సోన్ సీఐ 94409 00679, లక్ష్మణచాంద ఎస్సై 94409 00645లో సంప్రదించాలని కోరారు. కనకాపూర్ సర్పంచి సుక్కు రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్