logo

Crime News: ఆస్తిదక్కాలని.. తల్లినేఅంతమొందించాడు

ఆస్తి కోసం తనయుడు తల్లిని హతమార్చిన ఘటన.. వట్‌పల్లి మండలం పోతులబోగుడలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై దశరథ్‌ తెలిపిన వివరాలు.. మండలంలోని పోతులబోగుడ గ్రామానికి చెందిన మొండి మల్లమ్మ(55)కు

Updated : 27 Jan 2022 06:06 IST

తనయుడి చేతిలో తల్లి హతం

పోతులబోగుడలో విషాదం

వట్‌పల్లి, న్యూస్‌టుడే: ఆస్తి కోసం తనయుడు తల్లిని హతమార్చిన ఘటన.. వట్‌పల్లి మండలం పోతులబోగుడలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై దశరథ్‌ తెలిపిన వివరాలు.. మండలంలోని పోతులబోగుడ గ్రామానికి చెందిన మొండి మల్లమ్మ(55)కు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు తనయులు. భర్త లక్ష్మయ్య, ఓ తనయుడు మృతి చెందారు. ముగ్గురు కూతుళ్లకు వివాహాలు చేసి అత్తారింటికి పంపారు. తనయుడు మురళికి వివాహం చేయగా.. భార్యతో పాటు మల్లమ్మతోనే కలిసి ఉంటున్నారు. మురళి చెడు అలవాట్లు, మద్యానికి బానిసై అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు మల్లమ్మ పేరుపై ఉన్న ఆరెకరాల భూమి, బంగారు నగలు ఇవ్వాలని తరచూ ఆమెతో గొడవ పడేవాడు. కూతుళ్లు, కుమారునికి తన ఆస్తిని సమానంగా పంచుతానని తల్లి చెప్పడంతో.. ఆమెపై కక్ష పెంచుకున్నాడు. మల్లమ్మను హత్య చేస్తే ఆస్తితో పాటు, నగలు తనకే దక్కుతాయని పథకం వేశాడు. మంగళవారం భార్యను పుట్టింటికి పంపించాడు. బుధవారం తెల్లవారుజామున మల్లమ్మ ఇంట్లో నిద్రిస్తుండగా.. గొంతు నులిమి హత్య చేశారు. గ్రామస్థుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న జోగిపేట సీఐ శ్రీనివాస్‌, ఎస్సై దశరథ్‌ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వివరాలు సేకరించారు. మల్లమ్మ అల్లుడు జనార్దన్‌ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్సై రని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని