భార్యపై ప్రేమతోనే చోరీలకు తెగిస్తూ..
కరడు గట్టిన గొలుసు దొంగ ఉమేష్ ఖతిక్. పోలీసు రికార్డుల ప్రకారం ఇతడి పేరు ఉమేష్ అలియాస్ లాలో గులాబ్జీ ఖతిక్. మైనర్గా ఉన్నప్పుడే గొలుసు చోరీల బాటపట్టాడు. అరెస్టయి జైలుకెళ్లినా బయటకు వచ్చి వరుస చోరీలతో హల్చల్ చేస్తుంటాడు.
అహ్మదాబాద్ జ్యుడీషియల్ కస్టడీలో గొలుసు దొంగ
ఈనాడు, హైదరాబాద్: కరడు గట్టిన గొలుసు దొంగ ఉమేష్ ఖతిక్. పోలీసు రికార్డుల ప్రకారం ఇతడి పేరు ఉమేష్ అలియాస్ లాలో గులాబ్జీ ఖతిక్. మైనర్గా ఉన్నప్పుడే గొలుసు చోరీల బాటపట్టాడు. అరెస్టయి జైలుకెళ్లినా బయటకు వచ్చి వరుస చోరీలతో హల్చల్ చేస్తుంటాడు. భార్యపై ప్రేమతోనే దొంగతనాలు చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. చోరీలు చేసే సమయంలో సెల్ఫోన్లలోని సిమ్కార్డు తీసివేస్తాడు. ఈ నెల 19న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 5 గొలుసు దొంగతనాలు చేసి పారిపోయాడు. సవాల్గా తీసుకున్న పోలీసులు నిందితుడి వివరాలు తెలుసుకునే లోపుగానే సొంతూరు అహ్మదాబాద్ చేరాడు. సీసీ ఫుటేజ్, ఆధార్ కార్డు ఆధారంగా ఆచూకీ గుర్తించిన హైదరాబాద్ పోలీసులు విషయాన్ని అహ్మదాబాద్ పోలీసులకు చేరవేశారు. ఒక కేసులో కోర్టుకు తరలిస్తుండగా పారిపోయాడని, అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మీరు ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తీసుకెళ్లవచ్చంటూ హైదరాబాద్ పోలీసులకు సలహా ఇచ్చారు. ఒమిక్రాన్ కేసుల ఉద్ధృతి నేపథ్యంలో అతన్ని తీసుకురావాలా వద్దా అనే విషయాన్ని పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు. గతంలో ఉమేష్ ఇక్కడ ఏమైనా నేరాలు చేశాడా! అనే కోణంలో ఆరా తీస్తున్నారు. గొలుసు చోరీలు చేసి తప్పించుకుని తిరుగుతున్న నేరస్తుల జాబితాలో ఇతడు ఉన్నాడా! అనే వివరాలు సేకరిస్తున్నారు. రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఉమేష్ ఖతిక్పై కేసులున్నాయి. ఆయా రాష్ట్రాల పోలీసులు కూడా నిందితుడిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
సీఎం జగన్పై రాయిదాడి కేసులో నిందితుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. -
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా