Crime News: నెట్ఫ్లిక్స్లోని వెబ్సిరీస్ స్ఫూర్తితో కిడ్నాప్లు.. ఐదుగురి రిమాండ్
అమ్మాయిలతో మాట్లాడాలనుకునే యువకులు.. విద్యార్థులను మాయమాటలతో ఆకర్షించి.. ఫలానా ప్రాంతానికి రావాలని కిడ్నాప్ చేసి, డబ్బు లాక్కుని
అపహరించేందుకూ ఓ కంపెనీ
బాధితులను ఆకర్షించేందుకు యువతితో మాటామంతి
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే, ఆసిఫ్నగర్: అమ్మాయిలతో మాట్లాడాలనుకునే యువకులు.. విద్యార్థులను మాయమాటలతో ఆకర్షించి.. ఫలానా ప్రాంతానికి రావాలని కిడ్నాప్ చేసి, డబ్బు లాక్కుని వదిలేస్తున్న ముఠాను ఆసిఫ్నగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ముఠా నాయకుడు గుంజపోగు సురేశ్ సహా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కొత్వాల్ సీవీ ఆనంద్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఏడాదిగా వీరు ఆరుగురిని అపహరించారు. పదిరోజుల క్రితం గుడిమల్కాపూర్లో ప్రశాంత్ అనే యువకుడికి కిడ్నాప్ చేసినట్లు అతడి సోదరి ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తులో వారి నేరాలు వెలుగు చూశాయని పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ వివరించారు.
ఉద్యోగులను నియమించుకుని..
అత్తాపూర్లో ఉంటున్న సురేశ్(27) చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి రెండేళ్ల క్రితం బయటకు వచ్చాడు. విభిన్నంగా నేరాలు చేయాలన్న లక్ష్యంతో నెట్ఫ్లిక్స్లో అతడు చూసిన మనీహెయిస్ట్ వెబ్సిరీస్ స్ఫూర్తితో కిడ్నాప్లు చేయాలని నిర్ణయించుకున్నాడు. గతేడాది జనవరిలో మెహిదీపట్నంలోని భోజగుట్టలో నివాసముంటున్న రోహిత్, ఇందూరి జగదీశ్, కునాల్ను ఉద్యోగులుగా నియమించుకున్నాడు. యువకులు, విద్యార్థుల ఫోన్ నంబర్లు సేకరించాడు. వారితో మాట్లాడేందుకు జగద్గిరిగుట్టలో నివాసముంటున్న శ్వేతాచారిని ఒప్పించాడు. కిడ్నాప్ చేసేందుకు సెకెండ్ హ్యాండ్ కారు కొని.. అపహరణలు ప్రారంభించారు.
* ఒకటి, రెండ్రోజులు బాధితులతో శ్వేతాచారి ద్వారా వాట్సప్లో మాట్లాడించాక ఫలానా ప్రాంతానికి రావాలంటూ ఫోన్లో చెప్పేవారు. బాధితుడు రాగానే అప్పటికే కారులో ఉన్న రోహిత్, కునాల్ అతడిని కారులో ఎక్కించుకుంటారు. బెదిరించి అతడి కుటుంబ సభ్యులకు డబ్బు కోసం ఫోన్ చేయిస్తారు. లేదంటే చంపేస్తామంటూ చెబుతారు. అతడి డెబిట్కార్డులో నగదు వేయించి.. సమీపంలో ఏటీఎం కేంద్రానికి తీసుకెళ్లి విత్డ్రా చేసుకుంటారు.
* డబ్బు తీసుకోవడం కూడా కొత్త పద్ధతుల్లో తీసుకునేవారు. ప్రశాంత్ను కిడ్నాప్ చేసిన సురేశ్ ముఠా.. కుటుంబీకులను డబ్బు తీసుకుని బాహ్యవలయ రహదారి సమీప ఓ వంతెన వద్దకు రమ్మన్నారు. అక్కడ కారులో కిడ్నాపర్లు ఉండగా.. ప్రశాంత్ సోదరులు తెచ్చిన రూ.50 వేలను వంతెన పైనుంచి తాడు వేసి దానికి కట్టించి తీసుకున్నారు.
పోలీస్.. పవన్కల్యాణ్ టాటూలు
కారును చాకచక్యంగా వేగంగా నడిపే సరేశ్ వ్యవహారశైలి చిత్రంగా ఉందని పోలీసులు తెలిపారు. ఒక చేతికి పోలీస్.. మరోచేతికి పవన్కల్యాణ్ పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. విలాసంగా జీవించాలని, కారుల్లో తిరగాలన్నది సురేశ్ ఆశ. అందుకే గదిలో కాకుండా కారులోనే పడుకుంటాడని వివరించారు. ఆసిఫ్నగర్ పోలీసులు అతడు కారులో పడుకున్నప్పుడు చుట్టూ ఐదు డీసీఎంలను ఉంచి అదుపులోకి తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, కొత్త కస్టమర్లు చేర్చుకోవడంపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ