Hyderabad News: హైదరాబాద్లో అదృశ్యం.. దిల్లీలో ప్రత్యక్షం
ఆరేళ్ల బాలుడు అనూహ్యంగా ఐదు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు కంగారుపడి అన్నిచోట్లా వెతుకుతుండగా ఉన్నట్టుండి దిల్లీలో ప్రత్యక్షమయ్యాడు.
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే, ఆసిఫ్నగర్: ఆరేళ్ల బాలుడు అనూహ్యంగా ఐదు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు కంగారుపడి అన్నిచోట్లా వెతుకుతుండగా ఉన్నట్టుండి దిల్లీలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారంతో హబీబ్నగర్ ఠాణా సిబ్బంది హుటాహుటిన విమానంలో వెళ్లి బాలుణ్ని తీసుకువచ్చి సోమవారం సాయంత్రం అప్పగించారు. మల్లేపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు హబీబ్నగర్ ఇన్స్పెక్టర్ నరేందర్ కథనం ప్రకారం.. మల్లేపల్లి బడీమసీదు ప్రాంతంలో ఉంటున్న కారు డ్రైవర్ హనీఫ్ కుమారుడు ఆయాన్ ఈనెల 17న తప్పిపోయాడు. పోలీసులు మూడు కమిషనరేట్ల పరిధుల్లో గాలిస్తున్నారు. అదే సమయంలో బాలుడి వివరాలు ట్విటర్, ఫేస్బుక్లో పోస్ట్ చేయగా వాటిని చూసిన దిల్లీలోని నిజాముద్దీన్ పోలీసులు ఆదివారం సమాచారం ఇచ్చారు.
సమాధానం లేని ప్రశ్నలెన్నో.. ఆయాన్ను తీసుకువచ్చేందుకు అదనపు ఇన్స్పెక్టర్ నరసింహ, బాలుడి తండ్రి హనీఫ్లు ఆదివారం దిల్లీకి వెళ్లారు. నిజాముద్దీన్ ఠాణాలో ఉన్న బాలుణ్ని తీసుకుని నగరానికి సోమవారం వచ్చారు. ఈ నెల 19న ఒక అపరిచిత వ్యక్తి ఠాణాకు వచ్చి తన ఆధార్, ఇతర వివరాలు నమోదుచేసి ఆయాన్ను అప్పగించి వెళ్లాడంటూ నిజాముద్దీన్ పోలీసులు చెప్పారు. మల్లేపల్లిలో ఉన్న బాలుణ్ని ఆ వ్యక్తే చేరదీసి రైల్లో దిల్లీకి తీసుకెళ్లాడని పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించాయి. కిడ్నాప్ చేసిన వ్యక్తి రైల్లో ఎందుకు తీసుకెళ్లాడు? ఎందుకు దిల్లీ పోలీసులకు అప్పజెప్పాడన్నది అంతుచిక్కడం లేదు. కిడ్నాప్ చేసుంటే ఆధార్కార్డు, వివరాలు పోలీసులకు ఎందుకు ఇచ్చాడని ఆరా తీస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!