Crime News: కాలనీల్లో ముందుగా మైనర్లతో రెక్కీ.. ఆపై చోరీలు
బాలురతో బస్తీలు, కాలనీల్లో రెక్కీ నిర్వహించి, చోరీలకు పాల్పడుతున్న ఇద్దరితో పాటు ఆ మైనర్లనూ టాస్క్ఫోర్సు పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ఫోర్సు డీసీపీ రాధా కిషన్రావు, పశ్చిమ మండలం అదనపు డీసీపీ
చోరీ ముఠాలో నలుగురి పట్టివేత
50 తులాల ఆభరణాలు స్వాధీనం
ఆసిఫ్నగర్, న్యూస్టుడే: బాలురతో బస్తీలు, కాలనీల్లో రెక్కీ నిర్వహించి, చోరీలకు పాల్పడుతున్న ఇద్దరితో పాటు ఆ మైనర్లనూ టాస్క్ఫోర్సు పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ఫోర్సు డీసీపీ రాధా కిషన్రావు, పశ్చిమ మండలం అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్దీఖీతో కలిసి డీసీపీ నోయల్ డేవిస్ కేసు వివరాలు వెల్లడించారు. ఆసిఫ్నగర్లోని జేబాబాగ్కు చెందిన సయ్యద్ ఇర్ఫాన్ పాషా అలియాస్ రెహ్మాన్(20), ఇద్దరు మైనర్లు స్నేహతులు. ఈ ఇద్దరు బాలురు మాసాబ్ట్యాంక్లోని ఫస్ట్లాన్సర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ అలీ హుజాఫా(19)ను ఇర్ఫాన్కు పరిచయం చేశారు. ఇర్ఫాన్, హుజాఫా ఇళ్లలో చోరీలకు పథకం రూపొందించారు. నలుగురూ కలిసి కాలనీల్లో బైక్లపై తిరుగుతూ, చోరీ చేయాల్సిన ఇళ్లను ఎన్నుకుంటారు. అనంతరం వెళ్లి రాడ్లతో తాళాలు పగులగొట్టి, అందినకాడికి సొమ్ము, ఆభరణాలు కాజేస్తుంటారు. 2021 అక్టోబరు నుంచి 2022 జనవరి 2 వరకు హుమాయునగర్ ఠాణా పరిధిలో మూడు.. ఆసిఫ్నగర్, గోల్కొండ, మంగళ్హాట్ ఠాణాల పరిధిలోని ఇళ్లలో మొత్తం ఆరు చోరీలకు పాల్పడ్డారు. హుజాఫా అబిడ్స్ ఠాణా పరిధిలోని చోరీ కేసులోనూ నిందితుడు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు నిఘా పెట్టి, నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.25 లక్షల విలువైన 50 తులాల బంగారు ఆభరణాలు, రూ.25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న సిబ్బందిని డీసీపీ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!